కొచ్చడైయాన్.. రజనీకాంత్ రూపంతో రజని కాంతే నటిస్తున్నాడు అని అనిపించేలా ముస్తాబయ్యి విడుదలైన యానిమేషన్ మూవీ కొచ్చడైయాన్. 3 డి టెక్నాలజీతో తయారయిన ఈ మూవీ విక్రంసింహ అనే పేరుతో తెలుగులోకి కూడా డబ్ అవడం కూడా జరిగింది.
కొచ్చడైయాన్.. రజనీకాంత్ రూపంతో రజని కాంతే నటిస్తున్నాడు అని అనిపించేలా ముస్తాబయ్యి విడుదలైన యానిమేషన్ మూవీ కొచ్చడైయాన్. 3 డి టెక్నాలజీతో తయారయిన ఈ మూవీ విక్రంసింహ అనే పేరుతో తెలుగులోకి కూడా డబ్ అవడం కూడా జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ అయ్యింది. 2014 లో రిలీజ్ అయిన ఆ మూవీ కి రజనీ కాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించింది. ఎంతో ఆర్బాటంగా ప్రారంభం అయ్యి అంతే ఆర్బాటంగా రిలీజ్ అయిన కొచ్చడైయాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. సాధారణంగా డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు గురించి కాలక్రమం లో అందరూ మర్చిపోతారు. వాటి గురించి ఎక్కడ చర్చ కూడా ఉండదు. కానీ ఇప్పుడు కొచ్చడైయాన్ మూవీ అందరి మధ్య చర్చకి దారితీసింది.
అసలు విషయంలో కి వస్తే.. ఈరోస్ ఇంటెర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసిన కొచ్చడైయాన్ మూవీని సునంద మురళి మనోహర్ ఇంకో ఇద్దరు భాగస్వామ్యులతో కలిసి నిర్మించింది. ఆ సమయంలో సునంద మురళి మనోహర్ బెంగళూరు కి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్ టైజింగ్ అనే సంస్థ దగ్గర 5 కోట్లు రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత సునంద మురళీమనోహర్ 5 కోట్ల రూపాయిలు కి సంబంధించి యాడ్ బ్యూరో వాళ్లకి చెక్కులు ఇస్తే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి.
దాంతో యాడ్ బ్యూరో వాళ్ళు చెన్నై కోర్ట్ లో సునంద మీద కేసు దాఖలు చేసారు. కేసు కి సంబంధించి గత డిసెంబర్ లోనే చెన్నై కోర్ట్ తీర్పు ఇచ్చింది. కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం సునందమురళిమనోహర్ బెంగళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్ టైజింగ్ సంస్థకి ఇవ్వా లసిన 5 కోట్ల రూపాయలకి గాను సంవత్సరానికి 9 శాతం వడ్డీ చొప్పున మొత్తం 7.70 కోట్ల రూపాయిలు ఇవ్వాలని తీర్పుని ఇచ్చింది. అలాగే సునంద మురళి మనోహర్ కి ఆరు నెలల జైలు శిక్ష ని కూడా విధించింది.
చెన్నై అల్లిపురంలోని కోర్ట్ ఇచ్చిన ఆ తీర్పుని సవాలు చేస్తూ సునంద మురళి మనోహర్ చెన్నై అదనపు సెషన్ కోర్ట్ లో అప్పీలు చేసింది. ఇప్పుడు తాజాగా చెన్నై సెషన్ కోర్ట్ తీర్పుని వెల్లడించింది. కింద కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం సునంద మురళి మనోహర్ యాడ్ బ్యూరో అడ్వర్ టైజింగ్ సంస్థకి 7.70 కోట్ల రూపాయిలని చెల్లించడంతో పాటు ఆరునెలల జైలు శిక్షని యధావిధిగా అమలు చెయ్యాలని ఉత్తర్వులు జారీచేసింది. కాగా సునంద మురళీమనోహర్ తీసుకున్న అమౌంట్ కి రజని కాంత్ భార్య లత హామీ గా ఉన్నారు. అలాగే ఈ యానిమేషన్ మూవీ లో బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకునే రజనీకాంత్ కి జోడిగా నటించింది.