భార్యాభర్తల గొడవలు.. వీటి గురుంచి చెప్పాలంటే టైం సరిపోదు. ఇద్దరి మధ్య ప్రేమ, , సఖ్యత, సర్దుకుపోయే గుణం.. ఇలాంటి లక్షణాలు ఉంటే ఎంతటి గొడవైనా సరే కాసేపటికి కలిసిపోతారు. లేదు.. నేనేందుకు సర్దుకుపోవాలి అనుకుంటే ఎంతటి చిన్న విషయమైనా వాదోపవాదనలు జరిగి చివరకి గొడవకు దారితీస్తుంది. మనం చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి కోర్టు వరకు వెళ్లారు. భరణం కోసం భార్య.. భర్త మీద కేసు వేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది కదా. అయితే.. ఏం జరిగిందో తెలియదు కానీ,.. ఉన్నట్టుండి భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది మహిళను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో చోటుచేసుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారతి పటేల్(23) అనే మహిళ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్ భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్ వెంటపడి మరీ దాడి చేశాడు. మహిళ పరుగెడుతున్నా ఆమె వెంట మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Shameful…
Lawyer ran and beat woman in Shahdol court premises, woman’s child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj— Subham Anand (@anand_subham1) May 6, 2022
ఇది కూడా చదవండి: Assam Lady SI: మరి కొద్ది నెలల్లో వివాహం.. కాబోయే భర్తను అరెస్ట్ చేసిన మహిళ!
ఎలాగోలా లాయర్ నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు పిర్యాదు చేయడంతో భగవాన్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాయర్ అయ్యుండి సహనం లేకుండా మహిళపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. లాయర్ వృత్తి నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ తెలిపారు.