కోర్టు ప్రాంగణంలో ఇద్దరు లాయర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అందరూ చూస్తుండగానే వీళ్లు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు.
న్యాయవాద వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. జడ్జిలు, లాయర్లకు ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు. సమాజంలో కీలకమైన మార్పులు తీసుకురావడంలోనూ, న్యాయాన్ని కాపాడటంలోనూ, న్యాయం కోసం పోరాడటంలోనూ వీరిది కీలక పాత్ర. అలాంటి న్యాయవాదులు అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి.. కోర్టు ప్రాంగణంలోనే కొట్టుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఓ పురుష లాయర్, ఒక మహిళా లాయర్ కొట్టుకున్న ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో చోటుచేసుకుంది. లాయర్లు విష్ణు కుమార్ శర్మ, నేహా గుప్తాలు గురువారం ఒక విషయంపై వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ముదిరి ఒకర్నొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. కోర్టులో అందరూ చూస్తుండగానే విష్ణు కుమార్-నేహా శర్మలు ఒకరి మీద ఒకరు దాడికి దిగారు.
మొదట నేహా గుప్తా చెంప మీద విష్ణు కుమార్ రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ఎదురుతిరిగింది. విష్ణును నేహా కొట్టగా.. తిరిగి ఆమెను అతడు కొట్టాడు. వాళ్లిద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఒకరి మీద మరొకరు పంచ్లు కురిపించుకున్నారు. ఈ ఘటన తర్వాత విష్ణు కుమార్పై నేహ కంప్లయింట్ చేసింది. తనపై అతడు అకారణంగా దాడి చేశాడని ఆరోపించింది. విష్ణు శర్మ దాడిలో తన ముఖంతో పాటు శరీరంపై గాయాలు అయ్యాయని కంప్లయింట్లో పేర్కొంది. నేహ ఫిర్యాదుతో ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు పోలీసులు. ఓ స్త్రీ లాయర్, మరో పురుష లాయర్ కొట్లాడిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
#NewDelhi: A video capturing an intense fight between two lawyers, one of whom is a woman, within the premises of the Rohini court, has taken social media by storm.
A senior police official said that they have received that complaint and further investigation is going on in the… pic.twitter.com/Giw3erSTs4
— IANS (@ians_india) May 19, 2023