జార్ఖండ్ రాష్ట్రంలో డియోఘర్లోని త్రికూట్ పర్వత ప్రాంతంలో పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక పర్యాటకుడు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డాడు. ఈ ఘటనలో పర్యాటకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.! చివరిలో షాకింగ్ ట్విస్ట్!
దేశంలోనే అత్యంత ఎత్తయిన వర్టికల్ రోప్వేపై రెండు కేబుల్ కార్లు ఢీకొన్న సంగతి తెలిసింది. ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక బైద్యనాథ్ ఆలయానికి వచ్చిన భక్తులు.. అక్కడికి దగ్గర్లోని త్రికూట్ పర్వతాల మధ్యన కేబుల్ కార్లలో విహరించేందుకు వెళ్లారు. అందులో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తతెత్తింది. దీంతో 25 కేబుల్ కార్ల శ్రేణి..వందల అడుగుల ఎత్తున గాల్లో అలాగే నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓ కేబుల్ కారును.. ఎదురుగా వస్తున్న కేబుల్ కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి! కొనసాగుతున్న ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్!ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగాయి. అంతేకాక రెండు ఎంఐ-17 హెలికాప్టర్లను సహాయక చర్యలకు వినియోగించింది వైమానిక దళం. ఈక్రమంలో సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక పర్యాటకుడు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డాడు. అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. కేబుల్ కార్లు ఢీకొన్న ప్రమాదం నుంచి 32 మందిని రక్షించామని.. మరో 15 మంది పర్యాటకులు చిక్కుకున్నారని జార్ఖండ్ పర్యటక శాఖ మంత్రి హఫీజుల్ హసన్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నాయని.. దీనిపై విచారణ జరుపుతామని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కరోనా వ్యాక్సిన్ చేసిన వండర్! పక్షవాతం మాయమైంది.. మూగ వ్యక్తి మాట్లాడుతున్నాడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.