ప్రకృతి ప్రకోపానికి భారీ మూల్యం చెల్లించుకున్నాయి టర్కీ, సిరియా దేశాలు. ఊహించని విపత్తులు ఒక్క సారిగా ఆ దేశాల రూపు రేఖలను మార్చేశాయి. వరుసగా సంభవించిన భూకంపాల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. పుండుపై రోకలి పోటులా ఇంకా ఇప్పటికీ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం కూడా సెంట్రల్ టర్కీలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.6గా నమోదైంది. దీంతో భయం గుప్పిట్లో ఆ దేశ వాసులు బతుకుతున్నారు. చాలా మంది నిరాశ్రయులు ఆశ్రయాలు లేక రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. కష్టకాలంలో ఉన్న టర్కీ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది.
సోమవారం సంభవించిన వరుస భూకంపాల్లో టర్కీ, సిరియా దేశాలు భారీ ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. భూకంప ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య 4,400కు చేరుకుంది. గత లెక్కల ప్రకారం.. టర్కీలో 2,379 మంది మరణించగా.. సిరియాలో 1,444 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 5,600లకు పైగా భవనాలు కూలిపోగా, సిరియాలో 224 భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చల్లటి వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కూలిన భవనాలను రంపాలను వినియోగించడం వల్ల ఆ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారూ కొంత మంది ప్రాణాలతో బయట పడొచ్చు, మరికొంత మంది మృతి చెందుతారని అంచనా. అటు విద్యుత్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు నిలిచిపోయాయి. అటు అంధ కారణంగా కూడా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. టర్కీలో 14,483 మంది గాయపడగా.. సిరియాలో 3,500 మంది క్షతగాత్రులయ్యారు. వీరిందరికీ చికిత్స అందిస్తున్నారు.
టర్కీ డిజాస్టర్ అండ్ మేనేజ్ మెంట్ ఆధారిటీ ప్రకారం.. ఈ శతాబ్దంలో ఇప్పటి వరకు ఇదే ఘోరమైన విపత్తు. 1999లో టర్కీలో సంభవించిన భూకంపంలో 17వేల మందికి పైగా మరణించారు. ఈ ఘటనను టర్కీ అధ్యక్షుడు టయ్యిప్ ఎర్డోగన్ చారిత్రాత్మక విపత్తుగా పేర్కొన్నారు ఈ భూకంపాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున టర్కీ ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పెను విపత్తుపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. టర్కీకి ఆపన్న హస్తం అందించేందుకు పలు దేశాలు సిద్ధమయ్యాయి. అమెరికా, భారత్ వంటి దేశాలతో పాటు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. టర్కీ సహాయక చర్యలకు మద్దతుగా తమ రెస్య్కూ బృందాన్ని తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ దేశాలతో పాటు దక్షిణ కొరియా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ వంటి దేశాలు టర్కీకి సాయమందించనున్నాయి.
టర్కీలో సంభవించిన భారీ విపత్తుపై భారత ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. భారీ సాయాన్ని ప్రకటించారు. తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి మోడీ తరుపున సానుభూతితో పాటు మానవతా మద్దతును ప్రకటించారు. భారీ రెస్క్యూ సిబ్బంది, మెడికల్, పారామెడికల్ సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్ ను తక్షణమే పంపాలని నిర్ణయించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్, అవసరమైన పరికరాలతో 100 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం టర్కీకి పంపనున్నట్లు పేర్కొంది. ఈ ఉదయం సహాయక సామాగ్రితో కూడిన విమానం ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన టర్కీలోని అదానాకు చేరుకుంది. భారత్ చేసిన సాయానికి గానూ టర్కీ కృతజ్ఝతలు తెలిపింది. తమకు నిధులు అందించిన భారత్ ను దోస్త్ అని సంభోధించింది. ఆపదలో ఉన్ననాడు ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు అనే కొటేషన్ తో ధన్యవాదాలు తెలిపింది.
“Dost” is a common word in Turkish and Hindi… We have a Turkish proverb: “Dost kara günde belli olur” (a friend in need is a friend indeed).
Thank you very much 🇮🇳@narendramodi @PMOIndia @DrSJaishankar @MEAIndia @MOS_MEA #earthquaketurkey https://t.co/nB97RubRJU— Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 6, 2023