ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వెంటనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రమాదానికి కారణం వారే అంటూ ఒక వర్గంపై మరొక వర్గం దుష్ప్రచారం చేస్తుంటారు. రీసెంట్ గా ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదంలో 292 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణం ఒక వ్యక్తి అని.. అతను పశ్చిమ బెంగాల్ లోని మదర్సాలో దాక్కుంటే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని కొడుతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి స్టేషన్ మాస్టర్ మహమ్మద్ షరీఫ్ అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత? నిజంగానే పోలీసులు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పెట్టుకున్నారా? అతన్ని కొడుతుండగా దృశ్యాలను రికార్డ్ చేశారా? అతను నిజంగానే స్టేషన్ మాస్టర్ మహమ్మద్ షరీఫ్ ఏనా? ఈ ప్రచారంలో నిజమెంత?
రైలు ప్రమాదం జరిగిన చోటుకు దగ్గరలో ఉన్న బాహనాగ బజార్ స్టేషన్ మాస్టర్ మహమ్మద్ షరీఫ్ పరారీలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని కొన్ని మీడియా సంస్థలు ఆధారాలతో సహా ఖండించాయి. అసలు ఆ రైల్వే స్టేషన్ లో మహమ్మద్ షరీఫ్ అనే పేరుతో స్టేషన్ మాస్టర్ లేరని.. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ ఇన్ ఛార్జ్ గా ఉన్నది స్టేషన్ మాస్టర్ సూపరింటెండెంట్ ఎస్.బి. మొహంతి అని తేలింది. అసలు ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని ఇంకా సీబీఐ వెల్లడించలేదు. అంతేకాదు రైల్వే సిబ్బంది ఎవరూ కూడా పరారీలో లేరని, అందరూ విచారణకు సహకరిస్తున్నారని సౌత్ ఈస్టర్న్ రైల్వే క్లారిటీ ఇచ్చింది.
మరి వైరల్ అవుతున్న వీడియో ఏంటి? అందులో ఉన్నది ఎవరు? అన్నది పరిశీలిస్తే అది మెక్సికోలో పట్టుబడిన ఒక దొంగను చావకొడుతున్న వీడియో. ఈ వీడియో రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని కొంతమంది ఒడిశా రైలు ప్రమాదానికి ముడిపెడుతూ మహమ్మద్ షరీఫ్ కి చెందిన వర్గాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఆ వీడియోలో ఉన్నది మహమ్మద్ షరీఫ్ కాదు, అతను మెక్సికోకి చెందిన దొంగ. ఆ వీడియో కూడా పాతదే. కాబట్టి ఈ వార్తను, వీడియోను ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
.@bsindia has claimed that Signal Inspector was missing after the interrogation by Central Bureau of Investigation in connection with #Odisha train tragedy#PIBFactCheck
▶️This claim is #Fake
▶️None of the staff involved in the ongoing investigation are missing or absconding pic.twitter.com/8WmdWWvV1r
— PIB Fact Check (@PIBFactCheck) June 20, 2023
#WATCH | Balasore train accident | “A few media reports are coming in that a Bahanaga staff is absconding and missing. This is factually incorrect. The entire staff is present & a part of inquiry. They are appearing before agency,” says Aditya Kumar Chaudhary, CPRO South Eastern… pic.twitter.com/Htc538cIFp
— ANI (@ANI) June 20, 2023