ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వెంటనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రమాదానికి కారణం వారే అంటూ ఒక వర్గంపై మరొక వర్గం దుష్ప్రచారం చేస్తుంటారు. రీసెంట్ గా ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత?