ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ భూకంపాలు సంబవిస్తున్నాయి. టర్కీ, సిరియా లో సంబవించిన భూకంప ప్రళయంలో ఇప్పటికే 50 వేల మంది చనిపోయారు. భారత్ లో కూడా గత కొంత కాలంగా వరుస భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
ఈ మద్య వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అసలు భూకంపం అనే పేరు వినిపిస్తే చాలు వెన్నుల్లో వణుకు పుడుతుంది. టర్కీ, సిరియాలో ఈ నెల జరిగిన భూకంప ప్రళయం అంతా ఇంతా కాదు.. ఇప్పటికే ఇక్క 50 వేల మంది చనిపోయారంటే భూకంప ప్రభావం ఎంత ఘోరంగా పడిందో అర్థం అవుతుంది. ఇప్పటికీ అక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇక భారత్ లో కూడా ఈ మద్య వరుస భూకంపాలు భయంకంపితులను చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో భూకంపం సంబవించింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. ఈ నెల 22 న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఎన్ సీఆర్ లోని పలు ప్రాంతాల్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది నేపాల్ లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంబవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. తాజాగా గుజరాత్ లో భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.3 గా నమోదు అయ్యింది. మధ్యహ్నాం 3 గంల ప్రాంతంలో గుజరాత్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంబవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది.
రాజ్ కోట్ కు 270 కిలోమీటర్ల దూరంలో భూమిరి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు గుచారు. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు అంటున్నారు. గత వారం గుజరాత్ లో ని అమ్రేలీ జిల్లాలో కొన్ని చోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ వారు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. భూమి స్వల్పంగా కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై పరుగులు తీశారు.
Earthquake of Magnitude:4.3, Occurred on 26-02-2023, 15:21:12 IST, Lat: 24.61 & Long: 69.96, Depth: 10 Km ,Location: 270km NNW of Rajkot, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/Hiu0hB3Qm6@ndmaindia @NDRFHQ @Indiametdept @Dr_Mishra1966 pic.twitter.com/I0HG5TjllI
— National Center for Seismology (@NCS_Earthquake) February 26, 2023