తమిళనాడులోని కూనూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న IAF MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బిపిన్ రావత్ కుటుంబ సభ్యులు సహా మరో ముగ్గురు అత్యున్నత అధికారులు ఉన్నట్లు సమాచారం. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెల్లింగ్ టన్ కంటోన్మెంట్ ఆస్పత్రికి తరలించారు.
అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. మరణించిన వారు ఎవరు అనేది ఇంకా తెలిసిరాలేదు. భారత వైమానికి దళం ప్రమాదానికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ ఉన్నట్లు వెల్లడించారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన కారణాలు, వివరాలు ఏమీ వెల్లడించలేదు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. అయితే దీనిపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.