ఒడిశా రైలు ప్రమాదంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఒడిశా పెను విషాదం దేశ ప్రజలందర్నీ కలచివేసింది. బాలేశ్వర్కు సమీపంలో మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య దాదాపుగా 300కి చేరువైంది. ఇంకా వందలాది సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. దీంతో ఈ యాక్సిడెంట్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తునాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రైల్వే శాఖ, ఆ డిపార్ట్మెంట్ అధికారుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. స్టేషన్ మాస్టర్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. లూప్లైన్లో ఒక రైలు ఆగి ఉన్నప్పుడు.. ఆ మార్గంలోనే వస్తున్న మరో రైలును ఎందుకు ఆపలేదని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఎవరిది తప్పు అనేది ఇంకా తేలలేదు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై రైల్వే శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరగనుందని తెలుస్తోంది. కాగా, ఒడిశా రైలు ప్రమాదంపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర విషాదంపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. దేశం మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన ఒక విషాదం ఇది అని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదని.. ఈ విషాదానికి మూల కారణం ఏంటో తెలుసుకోవాలని ఆనంద్ మహీంద్రా చెప్పారు. మానవ తప్పిదమా లేదా సాంకేతిక లోపమా అనేది గుర్తించాలన్నారు. ఏదైనా సరే, ఇంతటి విషాదానికి దారితీయకూడదన్నారు. రైల్వే ఆపరేషన్స్లో ఫెయిల్-సేఫ్ మెకానిజమ్ వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి సమీక్షించుకోవాలని రైల్వే శాఖకు సూచించారు ఆనంద్ మహీంద్రా.
A tragedy the scale of which requires the entire country to pause in silent reflection, in memory of those who have lost their lives. Om Shanti🙏🏽 We cannot let such accidents happen again. We must get to the root cause of this tragedy. Whether human or technical error, neither… https://t.co/fxs2k387YG
— anand mahindra (@anandmahindra) June 3, 2023