ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్ పై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వరుసగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్ కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో కొన్నేళ్ల పాటు మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్స్ కి అడ్డాగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. యూపీలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్న యోగి ఆదిత్యనాథ్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అంతమొందించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మాఫియా, గ్యాంగ్ స్టర్స్ పని పడుతూ క్రిమినల్ రేట్ తగ్గిస్తున్నారు. మాఫియా లీడర్లు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించనున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తర్వాత యోగి ఆదిత్యనాథ్ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్స్టర్స్, ఉగ్రవాదులు, మాఫియా లీడర్ల భరతం పడుతూ అవినీతి అధికారులపై ఉక్కపాదం మొపుతూ పాలన కొనసాగిస్తున్నారు. ఆయన రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో క్రిమినల్ రేటింగ్ తగ్గిస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా కొనసాగుతున్నారు. ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల భూములు కబ్జా చేశాడు. అతీక్ అహ్మద్ మరణం తర్వాత యూపీ ప్రభుత్వం అతనికి సంబంధించిన కబ్జా భూమిని స్వాధీనం చేసుకొని ప్రధాని ఆవాస్ యోజన కింద 76 ఇళ్లను కట్టించి నేడు లబ్దిదారులకు తాళాలు అందించింది.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి యోగి ఆదిత్యనాథ్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్ల ఉన్న ఈ ఫ్లాట్ల కోసం దాదాపు ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యోగా ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2017 కు ముందు ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ పేద ప్రజల భూములను కబ్జా చేసుకున్నారని.. నిర్భాగ్యులైన పేదవారు వారిని ఎదిరించలేక అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. తమ ప్రభుత్వం నేరస్థులపై ఉక్కపాదం మోపుతుందని.. ల్యాండ్ మాఫియాను అణచివేసి పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుందని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్ని శక్తులతో అయినా పోరాడుతా అని అన్నారు.
#Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly.
The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj
(via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho
— Hindustan Times (@htTweets) June 30, 2023