తీరమేమో 200 కి.మీ. దూరం.. అసలే చీకటి గాడాంధకారం.. అందుబాటులో మనిషి లేడు. గుండెపోటు వచ్చింది. మొత్తానికి ఎలాగోలా 200 కి.మీ. దూరం ప్రయాణించి చైనీయుడ్ని భారతీయులు రక్షించారు.
సముద్రంలో ప్రయాణిస్తున్న చైనా వ్యక్తికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని కాపాడేందుకు భారత కోస్ట్ గార్డ్ ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయలేదు. చిమ్మ చీకట్లో ఎయిర్ లిఫ్ట్ చేసి చైనా వ్యక్తిని ఆసుపత్రికి తరలించింది. వివరాల్లోకి వెళ్తే.. పనామా పతాకంతో కలిగిన ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసెర్చ్ నౌక ఒకటి చైనా నుంచి యూఏఈ వెళ్తోంది. అరేబియా సముద్రం మార్గం మీదుగా ఈ నౌక వెళ్తుంది. అయితే బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేసే యిన్ వీగ్ యాంగ్ అనే సిబ్బంది గుండెపోటుకు గురయ్యారు. ఛాతీ నొప్పితో విలవిలాడిపోతుండడంతో సహాయం చేయాలని సమీపంలో ఉన్న ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ కేంద్రానికి ఎమర్జన్సీ మెసేజ్ ఒకటి పంపారు.
అప్రమత్తమైన భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది.. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చేందుకు ఏఎల్హెచ్ఎంకే-3 హెలికాప్టర్ లో బయలుదేరారు. ఆ టైంలో గుండెపోటుకు గురైన వ్యక్తి ఉన్న నౌక అరేబియా సముద్రంలో తీరానికి 200 కి.మీ.ల దూరంలో ఉంది. అప్పుడు వాతావరణం కూడా ప్రతికూలంగానే ఉంది. అది కూడా రాత్రి సమయంలో రిస్కీ ఆపరేషన్ చేపట్టింది. కోస్ట్ గార్డ్ చీకటిలో సాహసం చేసి మరీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి సమయంలో భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది నౌకలోంచి వీగ్ యాంగ్ ని ఎయిర్ లిఫ్ట్ చేసి హెలికాప్టర్ లోనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆ వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
In a daring operation, @IndiaCoastGuard #ALH MK-III evacuates a #Chinese national from MV Dong Fang Kan Tan No 2 around 200 Km mid-sea amidst challenging night conditions & extreme weather. Patient was reported chest pain &cardiac arrest symptoms.#SAR #ArabianSea#MaritimeSafety pic.twitter.com/THG0nBZjhi
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 17, 2023