ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 290 మంది మృత్యువాత పడ్డారు. మరో 1000 మందికి పైగా తీవ్రంగా గాపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. తాజాగా ఒడిశా రైలు ఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది.
గత నెల ఒడిశాలో జరిగిన రైలు ఘటన దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఏదైనా ఉందా అన్న సందేహాలు వచ్చాయి. దీంతో కేంద్రం సీబీఐ ని రంగంలోకి దింపింది. తాజాగా ఈ కేసులో శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ ప్రమాదానికి గల కారణం తప్పుడు సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం యొక్క లోపాలని సీఆర్ఎస్ దర్యాప్తు నివేదిక స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమారు లు ఉన్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఈ ముగ్గురు సాక్ష్యాలను నాశనం చేయడం తదితర అభియోగాలు వారిపై మోపింది.
యావత్ దేశాన్ని ఒక్కసారే దిగ్బ్రాంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారణం కేవలం మానవ తప్పిదం అని రైల్వే సెఫ్టీ కమిషనర్ ఆరోపించింది. దీనితో పాటు ఏ విధమైన విధ్వంసం కానీ, సాంకేతిక లోపం గురించిన చర్చను రైల్వే సేఫ్టీ కమిషనర్ తిరస్కరించింది. ఈ ఘటన తర్వాత విచారణలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కూడా బహిర్గతమైందని.. తనిఖీల్లో అధికారులు తగిన భత్రతా విధానాలు పాటించలేదని తెలిపింది. మూడు సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా డిజైన్ లో మార్పులు చేసిన తర్వాత సరైన విధంగా పరీక్షలు చేయలేదని సిఆర్ఎస్ నివేధికలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
Balasore train accident | CBI has arrested 3 people, senior Section engineer Arun Kumar Mohanta, section engineer Mohammad Amir Khan & technician Pappu Kumar, under sections 304 and 201 CrPC pic.twitter.com/EkXTYFHncd
— ANI (@ANI) July 7, 2023