ఇటీవల కాలంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు సమాచార లోపం కారణంగా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో ప్రమాదాలు జరిగితే.. టెక్నికల్ లోపాల కారణంగా బోగీల్లో మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతుంటాయి.. మరికొన్ని సార్లు మానవ తప్పిదాల వల్ల రైల్ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్ప్రెస్ భారీ ప్రమాదం తప్పింది. రైలు లోని ఏసీ కోచ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విపరీతమైన పొగ అల్లుకుంది.. దీంతో ప్రయాణీకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వివరాల్లోకి వెళితే..
అవధ్-అసోం ఎక్స్ప్రెస్ ట్రైన్ అసోం డిబ్రూగఢ్ నుంచి బెంగాల్ లోని లాల్ గఢ్ కి బయలుదేరింది. ముజఫర్పూర్ రామ్ దయాల్ స్టేషన్ వద్దకు వస్తున్న సమయంలో రైలు లోని బి2 ఏసీ కోచ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీని ప్రభావంతో బోగీలో విపరీతమైన పొగ కమ్ముకుంది.. ప్రయాణీకులు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు.. అసలు ఏం జరుగుతుంతో అని భయంతో వణికిపోయారు. పొగ కారణంగా ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందయ్యందని ప్రయాణీకులు తెలిపారు. వెంటనే రైలు ని రామ్ దయాల్ స్టేషన్ వద్ద నిలిపివేశారు. దాంతో ప్రయాణీకులు రైలు బోగీ నుంచి దూకి పరుగులు తీశారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందిని పిలిచి మంటలను అదుపు చేశారు. ఏసీ బోగీలో మంటలు ఎలా వచ్చాయన్న విషయంపై విచారణ కోసం రైలును తరలించారు. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఏ హానీ జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణీకులను ఇతర రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేర్చారు.
#WATCH | Bihar: Avadh Assam Express caught fire near Ramdayalu Railway Gumti in Muzaffarpur yesterday. pic.twitter.com/m584LRQtGz
— ANI (@ANI) February 8, 2023