ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం!..
ఏటీఎంకు రూ.10 వేల జరిమానా..
అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలు!!!
ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని ఈనాడు తెలిపింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు, ఏటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు పెనాల్టీ ల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు చార్జీలు పడతాయి.
అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. దాంతో కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం చాలా ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు. డబ్బులు ఉన్నాయా లేవా అనేది తెలియదు. డెబిట్ కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత విషయం తెలుస్తోంది. దాంతో కస్టమర్లు అసౌకర్యాన్ని గురవుతారు. అయితే ఈ పరిస్థితులు ఇకపై లేకుండా చేసేందుకు ఏటీఎంలలో ఎప్పుడూ డబ్బులు ఉండేలా ఆర్బిఐ రూల్స్ సవరించింది.
ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు వైట్ లేబుల్ ఆపరేటర్లకు పది వేల చొప్పున జరిమానా పడుతుంది. ఆర్బీఐ జరిమానా భయంతో బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లకు ఏటీఎం లతో తిప్పలు తప్పే అవకాశం ఉంది.
మరిన్ని వివరాలకి ఈ వీడియో చూడండి: