ఎక్కడో షాపింగ్ మాల్ లో చిన్న షాపులో మొక్కజొన్న అమ్ముకునే సాధారణ కుర్రాడు అతను. అలాంటి కుర్రాడికి ఆనంద్ మహీంద్రా అనే వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొక్కజొన్న అమ్ముకునే కుర్రాడికి, ఆనంద్ మహీంద్రాకి ఏంటి సంబంధం? ఆనంద్ మహీంద్రా అంతలా ఇంప్రెస్ అవ్వడానికి కుర్రాడు చేసిన అద్భుతం ఏంటి? ఒకే ఒక్క ట్వీట్ తో ఆ కుర్రాడి జీవితమే మారిపోయింది.
సంగీతం యొక్క మాధుర్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సంగీతంతో మానసిక జబ్బులను నయం చేయవచ్చునని వైద్యులు చెబుతుంటారు. వినగలిగే శక్తి ఉండాలే గానీ ప్రకృతిలో ఉన్న ప్రతీ దాంట్లోనూ సంగీతం నిక్షిప్తమై ఉంటుంది. పక్షుల రెక్కల చప్పుళ్ళు, వీచే గాలులు, ఎగసే అలలు, కురిసే వాన ఇలా ప్రతీది సంగీతంలో భాగమే. అయితే సహజమైన సంగీతంతో పాటు కృత్రిమ సంగీతం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంగీతం వాయించాలంటే వాయిద్య పరికరాలు ఉండాలి. పెద్ద పెద్ద సంగీత దర్శకుల దగ్గర అంటే పరికరాలు ఉంటాయి. కానీ ఇవేమీ లేకపోయినా కూడా అద్భుతమైన సంగీతాన్ని వాయించగల కళాకారులు ఎంతోమంది ఉన్నారు.
సోషల్ మీడియా వచ్చాక కళాకారులకు కొదవ లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఆ మనిషి యొక్క నైపుణ్యం, ప్రతిభ అన్నీ బయటపడుతున్నాయి. ఆ మధ్య ఊరూరా తిరిగి పాటలు పాడుతూ పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి.. సోషల్ మీడియా ద్వారా అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. పెద్ద పెద్ద వాళ్ళ దృష్టిలో పడ్డారు. అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ప్రయత్నిస్తే విజయం వరించడం అనేది పెద్ద విషయమేమీ కాదని అనేక మంది నిరూపించారు. తాజాగా ఓ మొక్కజొన్న విక్రేత తన టాలెంట్ తో ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడ్డారు. ఆనంద్ మహీంద్రాని తన సంగీతంతో ఇంప్రెస్ చేసి.. ఏకంగా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్నారు.
అతను తమిళనాడులోని కోయంబత్తూరులో బ్రూక్ ఫీల్డ్స్ మాల్ లో స్వీట్ కార్న్ వెండర్ గా పని చేస్తున్నారు. పనిని ఒత్తిడిగా, భారంగా ఫీలవ్వకుండా.. ఒక కళలా ఫీలవుతూ సంతోషంగా చేస్తున్నారు. గరిటతో వాయిస్తూ.. కస్టమర్లకు స్వీట్ కార్న్ సరఫరా చేస్తున్నారు. గరిట వాయించినంత సేపు ఎంతో వినసొంపుగా ఉంది. అతను గరిటతో అలా వాయిస్తుంటే.. పూనకాలు వస్తున్నాయి. అంత శ్రావ్యంగా, వినసొంపుగా వాయించారు. అంత అద్భుతంగా సంగీతం వినిపించారు కాబట్టే ఆనంద్ మహీంద్రా ఇంప్రెస్ అయిపోయారు. అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేశారు.
‘ఇతను ఏ సంస్థలో పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ.. త్వరలో బెంగళూరులో జరగబోయే మహీంద్రా పెర్కుషన్ ఫెస్టివల్ లో అతను గౌరవ అతిథిగా ఉండాలి. లయ, వాయించడం అనేవి భారతదేశం యొక్క గుండె చప్పుడు అని అనడానికి ఇతనే సజీవ సాక్ష్యం’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి వీడియోని షేర్ చేస్తూ.. అతన్ని మహీంద్రా పెర్కుషన్ ఫెస్టివల్ కి అతిథిగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆనంద్ మహీంద్రాను మెచ్చిన ఈ యువ కళాకారుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే ఆ యువకుడు ఆలపించిన సంగీత మాధుర్యాన్ని విని ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.
I don’t know which establishment this gentleman works at, but he should be an honoured guest at our upcoming #MahindraPercussionFestival in Bengaluru. 😊 He is living proof that rhythm & percussion is the heartbeat of India! #SundayFeeling pic.twitter.com/B3okr25Wy8
— anand mahindra (@anandmahindra) February 12, 2023