Vadodara – Rambai: సంకల్పం గట్టిదైతే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది ఓ బామ్మ. 105 ఏళ్ళ వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవల వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో 105 ఏళ్ళ రాంబాయి అనే బామ్మ.. వంద మీటర్ల గమ్యాన్ని 45.40 సెకన్లలో పూర్తి చేసింది. అయితే.. ఈ రేసులో రాంబాయి తప్ప వేరెవరు పాల్గొనకపోవడం గమనార్హం.
కేవలం 100 ఏళ్లు పైబడిన వారికోసమే నిర్వహించిన ఈ రేసులో రాంబాయి మాత్రమే పాల్గొంది. తనకెవరూ పోటీ లేకపోవడంతో తన రికార్డును తానే బ్రేక్ చేసి గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక వంద మీటర్ల తర్వాత.. అదేరోజు 200 మీటర్ల రేసును ‘1 నిమిషం 52.17 సెకన్ల’లో పూర్తిచేయడం మరో విశేషం. ఆ తర్వాత రాంబాయిని స్టేడియం పైకి పిలిచి ప్రేక్షకులు చప్పట్లు, కేరింతల మధ్య అభినందించారు.
అనంతరం అక్కడి జనాలు రాంబాయితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ గుంపులో రాంబాయి మనవరాలు.. అథ్లెట్ షర్మిలా సంగ్వాన్ పాల్గొంది. తన బామ్మ గెలుపుతో షర్మిలా ఆనందంతో మురిసిపోయింది. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ.. ”మా నానమ్మ గెలుపు పట్ల మాకెంతో గర్వాంగా ఉంది. ఈ విజయానికి ఆమె అర్హురాలు. మామూలుగానే ఉదయాన్నే లేచి 3-4 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఈ విజయం ఆమెను మరింత బలపరిచింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బామ్మ పరుగుతీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt
— TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022