దేశంలో విభిన్న రకాల ఆహార పదార్థాల లభ్యత, దానికి తగినట్లుగానే జనాల ఆహారపు అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి. భోజన ప్రియులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంపుగా తింటారు.
దేశంలో విభిన్న రకాల ఆహార పదార్థాల లభ్యత, దానికి తగినట్లుగానే జనాల ఆహారపు అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి. భోజన ప్రియులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంపుగా తింటారు. కొందరు నాన్ వెజ్ తింటే, మరికొందరు వెజ్ పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. శరీరానికి శక్తి లభించాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఓ వృద్ధ మహిళ 13 సంవత్సరాలుగా కేవలం సుద్ద ముక్కలు మాత్రమే బుజిస్తూ కాలం గడుపుతోంది. ఆన్నం అంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? దీనికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెతుకు ముట్టకుండా సుద్ద ముక్కలు తింటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది రాజన్న సిరిసిల్లకు చెందిన మల్లవ్వ. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆమె అన్నం తినడానికి మాత్రం అంగీకరించలేదు. పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. చేసేదేం లేక ఆమె కోసం సుద్ద ముక్కలు తీసుకు వచ్చి ఆహారంగా ఇస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే.. అన్నం తింటే వాంతులు అవుతాయనే భయంతో అలా సుద్ద ముక్కలతో కడుపు నింపుకుంటుంది.
13 సంవత్సరాల క్రితం మల్లవ్వ అన్నం తింటుండగా ఎవరో చూశారట.. ఆ కాసేపటికే ఆమెకు వాంతులు అయ్యాయట. ఇక అప్పటి నుంచి అన్నం వంక చూస్తేనే భయపడే స్థితికి చేరుకుంది. 13 సంవత్సరాలుగా సుద్ద ముక్కలు మాత్రమే ఆరగిస్తుంది. ఏ విధమైన అనారోగ్యానికి గురికాకుండా చాలా చురుకుగా ఉంటోంది. ఇది తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చిన్నతనంలో తెలిసి తెలియక బలపాలు, సుద్దముక్కలు తిన్న ఘటనలు చూశాం కానీ.. ఇది చాలా వింతగా ఉందంటూ షాక్ అవుతున్నారు.