దేశ వ్యాప్తంగా వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో.. అనేక రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
దేశ వ్యాప్తంగా వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో.. అనేక రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఇంట్లో నుండి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. కాగా, మహారాష్ట్రలో కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడ ఓ గ్రామంలో పెను విషాదం నెలకొంది. కొండ చరియలు విరిగి పడి అనేక మంది చనిపోయారు. మరికొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో వానలు పెను విషాదాన్ని నింపాయి. ముంబయికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలాపూర్ తాహసీల్లోని ఇర్షాల్వాడి గ్రామంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. 86 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందడం విచారకరం. వర్షంలోనూ సహాయక చర్యలు చేపడుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. దీంతో పాటు ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా సీఎంతో మాట్లాడారు. అలాగే ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులను సీఎం దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు.