దేశ వ్యాప్తంగా వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో.. అనేక రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సామాన్య వ్యక్తిలా మారి.. వీధిలో ఉండే దుకాణంకి వెళ్లారు. అక్కడ వస్తువులను కొనుగోలు చేసి.. ఆ షాపు యజమానిని ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాక ఆయన కాసేపు కార్యకర్తలు, అభిమానులతో సందడి చేశారు.
గత కొంత సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మారాఠి నటుడు ప్రదీప్ పట్వర్ధన్ కన్నుమూశారు. మంగళవారం ముంబైలోని తన స్వగృహంలో ప్రదీప్ పట్వర్ధన్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరాఠీ ఇండస్ట్రీలో ప్రదీప్ పట్వర్థన్ తనదైన నటనతో లెజెండరి యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన […]
ఒక్కసారి భారత రాజకీయ చరిత్రను తరచి చూస్తే.. వారసత్వ రాజకీయాలు వేళ్లునికునిపోయాయి అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి తరం నాయకులు కేసీఆర్, వైఎస్సార్ వరకు.. వీరంతా తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకువచ్చారు.. వస్తున్నారు. వారిని అన్ని విధాలుగా ప్రజలకు చేరువ చేసి.. ఆ తర్వాత వారికి పార్టీ కీలక బాధ్యతలు, కొన్ని సందర్భాల్లో సీఎం కుర్చీనే అప్పగిస్తున్నారు. మన దేశంలో ఏళ్లుగా రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. […]
Maharashtra: మహారాష్ట్ర శివసేన పార్టీ ఎంపీ రాహుల్ షెవాలే తనను మోసం చేశాడంటూ దుబాయ్ కి చెందిన మహిళ ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పెళ్లి నెపంతో తనపై అత్యాచారం చేశాడని, మానసికంగా దోపిడీకి పాల్పడుతున్నాడని సదరు మహిళ ముంబై సాకినాకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షెవాలే రాజకీయ పలుకుబడి కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు […]
Maharashtra New CM Eknath Shinde Biodata In Telugu: గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే అప్పగించారు. ఈ ట్విస్ట్తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. […]