ఈ ఆధునిక కాలంలో మనిషి ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎన్నో విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. భూమి, ఆకాశం, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా వర్షాలు పడుతున్నపుడు మెరుపులు వస్తుంటాయి.. మెరుపు ఎంత వేగంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇవి గంటకు 4.3 లక్షల కిలో మీటర్ల వరకు వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ మెరుపులు ఎంతో శక్తివంతంగా ఉండమే కాదు.. కాంతి వేగంతో దూసుకు వెళ్తాయి..అంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగం అన్నమాట. అలాంటి మెరుపులపై ఫ్రెంచి పరిశోధకులు అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు.. శక్తివంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటిని దారి మల్లించి విజయం అందుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఫ్రాన్స్ లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబోరెటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్ సంబంధించిన పరిశోధకులు అత్యాధునికమైన లేజర్ పరికరాలతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం కోసం 3 టన్నుల బరువు కారు సైజ్ లో ఏర్పాటు చేసిన లేజర్ పరికరాన్ని స్విట్జర్లాండ్లోని ఒక పర్వతంపై సుమారు 25 వందల మీటర్ల ఎత్తులో సిద్దం చేశారు. ఈ పరికరం ద్వారా సెకనుకి 1000కి పైగా శక్తివంతమైన లేజర్ కిరణాలు ఆకాశంలో మెరుపుల వైపు పంపించారు. ఈ ప్రయత్నంలో దాదాపు 160 అడుగుల మెరుపులను మల్లించగలిగారు. ఈ దృశ్యాలను హై స్పీడ్ కెమెరాల్లో రికార్డు చేశారు. మొత్తానికి తొలి ప్రయోగంతోనే అద్భుత విజయం అందుకున్నారు.
ఈ అద్భుతమైన ప్రయోగం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్స్ వివరిస్తూ.. ‘ఈ ప్రయోగంం ఎంతో విప్లవాత్మకమైనదని.. మెరుపు వేగాన్ని కంట్రోల్ చేయడంలో ఎంతో ఉపకరిస్తుందని’ తెలిపారు. వాస్తవానికి ఈ విషయం 1970 లోనే ప్రతిపాదించినప్పటికీ ల్యాబ్ లో ప్రయోగాలు చేశామని.. మొదటి సారిగా ప్రత్యక్షంగా వాతావరణంలో పరిశోధన చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు.. ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్ లో ప్రచురించబడ్డాయి. ఈ ప్రయోగం వర్షాలు వచ్చే సమయంలో పిడుగు పాటు వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించుకునేందుకు ఎంతో తోడ్పడతాయని భావిస్తున్నారు.