రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయింది. ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో.. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయిందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను చుట్టుముట్టింది. పుతిన్ ప్రకటన చేసిన కాసేపటికే ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ , లోని క్రామటోర్స్క్ లో పేలుళ్ల శబ్దం వినిపించింది. రష్యా యుద్ధ విమానాలు ఈ నగరాల్లో బాంబులు వేసినట్లుగా అంతర్జాతీయ వార్త సంస్థలు పేర్కొంటున్నాయి. రష్యా చర్యలను అమెరికా ఖండించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికతో కూడిన ట్వీట్ చేశారు. యుద్ధం వల్ల జరిగే ప్రాణనష్టానికి రష్యానే కారణం అవుతుందని.. ప్రపంచం మొత్తం రష్యాను జవాబుదారీ చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇక రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో అసలు ఈ రెండు దేశాల వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఏంటి.. ఎవరి సైనిక బలం ఎంత.. ఎవరి దగ్గర అత్యంత ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఏ దేశం సత్తా ఎంత అనే అంశాలపై అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆయుధ సంపత్తి గురించి పూర్తి వివరాలు..
ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా వద్ధే యుద్ధ సామాగ్రి అధికంగా ఉందని సీనియర్ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఇక రష్యా సైనిక బలం 9 లక్షలు. ఉక్రెయిన్ సైనిక బలం 2 లక్షలు మాత్రమే. గత దశాబ్దకాలంలో రష్యా మిలటరీ బడ్జెట్ ఖర్చు 30 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఉక్రెయిన్ మిలటరీ బడ్జెట్ కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా డిఫెన్స్ బడ్జెట్ 15 రెట్లు ఎక్కువ.
పైన టేబుల్ ని గమనిస్తే.. ఉక్రెయిన్ కంటే రష్యా వద్ద యుద్ధ ట్యాంక్లు ఆరు రెట్లు ఎక్కువ, ఆయుధాలు కలిగిన వాహనాలు 7 రెట్లు అధికం, ఫిరంగులు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ కంటే రష్యా సైన్యం రెట్టింపుగా ఉంది. ఎలా చూసకున్నా సైనిక బలంలో ఉక్రెయిన్ రష్యాతో ఢీ కొట్టలేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
పైన పట్టికను గమనిస్తే.. వైమానిక బలగాలలో కూడా రష్యా.. ఉక్రెయిన్ కన్నా పది రెట్లు శక్తివంతంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.
నేవీ దళాల విషయం తీసుకున్నా.. రష్యా.. ఉక్రెయిన్ కన్నా పదిరెట్లు బలంగా ఉంది.
మరోవైపు క్రూయిజ్ మిసైల్స్ను ఉపయోగించి ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి చేయొచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఓ వైపు సైనిక దాడుల పరంగానే కాకుండా రష్యా సైబర్ ఎటాక్స్ చేస్తుందని అమెరికా, ఉక్రెయిన్ భయపడుతున్నాయి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో సైబర్ దాడులు పెరగొచ్చని ఎఫ్బీఐ హెచ్చరిక జారీ చేసింది.
‘రష్యా మిలటరీ యాక్షన్తో ఉక్రెయిన్లో పరిస్థితులు దిగజారుతాయి. రష్యా ప్రోత్సాహంతో అమెరికా మీద సైబర్ ఎటాక్స్ జరగొచ్చు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్ మీద కూడా సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉంది‘ అని ఎఫ్బీఐ రిపోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ రిపోర్టన్ రష్యా తోసిపుచ్చింది. సైబర్ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.