నాలుగు విద్యార్థులు సరదాగా వేరే దేశానికి ట్రిప్ వేశారు. రెస్టారెంట్ లో కడుపు నిండా తిన్నారు. తీరా బిల్ చూస్తే లక్ష రూపాయలు అయ్యింది. అంత గట్టిగా ఏం తిన్నారంటే మామూలు ఫుడ్డే. అయినా కానీ లక్ష బిల్లు వేశారు. కానీ విద్యార్థులేమన్నా తెలివి తక్కువ వాళ్ళా.. లక్ష కట్టి 12.5 లక్షలు సంపాదించారు.
జపాన్ కి చెందిన నలుగురు స్నేహితులు హాలిడే వెకేషన్ కోసమని ఇటలీలోని వెనిస్ నగరానికి వెళ్ళారు. నలుగురూ విద్యార్థులే. ఇటలీ ట్రిప్ కోసమని చెప్పి చాలా కాలం నుంచి డబ్బులు దాచుకుంటూ వచ్చారు. అయితే దాచుకున్న డబ్బు మొత్తం రెస్టారెంట్ వాడే మింగేస్తాడని వారికి తెలియలేదు. నలుగురూ కలిసి రెస్టారెంట్ లో తిన్నందుకు రూ. లక్ష బిల్లు వేశారు. పాపులర్ సెయింట్ మర్క్స్ స్క్వేర్ సమీపంలో ఉన్న ఆస్టెరియా డి లూకా రెస్టారెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్నేహితులు 4 ప్లేట్లు బీఫ్, ఒక ప్లేటు ఫ్రైడ్ ఫిష్, ఒక మంచి నీటి బాటిల్ ఆర్డర్ చేశారు. తిన్న తరువాత వారికి రెస్టారెంట్ సిబ్బంది బిల్లు ఇచ్చారు. బిల్లు చూస్తే 1100 యూరోలు ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 97 వేలు పైనే. దాదాపు లక్ష రూపాయలు చెల్లించవలసి వచ్చింది.
అంత బిల్ ఏశావేంట్రా అని రెస్టారెంట్ సిబ్బందిని అడిగితే ఇంటర్నెట్ హాట్ స్పాట్ ని వాడినందుకు వేశామని సమాధానం చెప్పారు. విద్యార్థులు, రెస్టారెంట్ సిబ్బంది మధ్య వాదన జరిగింది. మొత్తానికి అసంతృప్తితోనే బిల్ సెటిల్ చేశారు విద్యార్థులు. అనంతరం విద్యార్థులు బలోగ్న పోలీస్ స్టేషన్ లో రెస్టారెంట్ పై కేసు వేశారు. రెస్టారెంట్ హిడెన్ ఛార్జీల గురించి చెప్పకుండా మమ్మల్ని రెస్టారెంట్ మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు రెస్టారెంట్ సిబ్బంది నుంచి విద్యార్థులకు 14,144 యూరోలు పరిహారం ఇప్పించారు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 12.5 లక్షలు. వీరి విషయంలోనే కాదు మిగతా కస్టమర్ల విషయంలో కూడా ఆ రెస్టారెంట్ ఇలానే అన్యాయంగా మోసం చేసి బిల్ వేస్తుందని మండిపడుతున్నారు.
ఫ్యామిలీ మీల్ కోసం వెళ్తే డబ్బు లూటీ చేస్తున్నారని ఒక వ్యక్తి రివ్యూ రాశాడు. ఫ్రైడ్ సీ ఫుడ్ కోసం 40.21 యూరోలు (రూ. 4,100), డిన్నర్ కోసం 14.18 యూరోలు (రూ. 1436) ఛార్జ్ చేస్తారని ఊహించలేదని మరొక కస్టమర్ వాపోయాడు. అంతేకాదు వాళ్ళు 15 శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారని.. వెయిటర్ ని అడిగితే ట్యాక్స్ అంటున్నాడని మండిపడుతున్నారు. అయితే జపాన్ కి చెందిన విద్యార్థులు రెస్టారెంట్ పై కేసు వేయడంతో వారికి జరిగిన అన్యాయానికి పరిహారంగా పన్నెండున్నర లక్షల పరిహారం పొందారు. వీరు మరొక రెస్టారెంట్ మీద కూడా ఫిర్యాదు చేశారు. 3 ప్లేట్లు సీఫుడ్ పాస్తా తిన్నందుకు రూ. 31 వేలు వసూలు చేసిందని ఫిర్యాదు చేఇస్సానట్లు డైలీ స్టార్ వెబ్ సైట్ కథనం రాసుకొచ్చింది.
Nei prossimi giorni verificheremo bene questo episodio, ci faremo inviare la copia della denuncia se è stata effettivamente presentata. Se sarà confermato questo episodio vergognoso, faremo tutto il possibile per punire i responsabili. Noi siamo per la giustizia, sempre! https://t.co/SgDDJWB3VP
— Luigi Brugnaro (@LuigiBrugnaro) January 21, 2018