వైరస్ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిలో కోవిడ్ వైరస్ను గుర్తించేందుకు స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ను వేగంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని చొప్పించాల్సిన అవసరం లేకుండానే ఈ పరీక్షను నిర్వహించొచ్చు. కచ్చితమైన ఫలితాన్ని పొందొచ్చు. బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కారం చేశారు. ఈ విధానానికి ‘ఫోన్ స్క్రీన్ టెస్టింగ్’ (పోస్ట్) అని పేరు పెట్టారు.
కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాలను నేరుగా సేకరించడానికి బదులు వారి మొబైల్ స్క్రీన్ల నుంచి స్వాబ్లు సేకరించి, పరీక్షించారు. ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్లకు నిర్వహించిన పీసీఆర్ పరీక్షలో ‘కొవిడ్ పాజిటివ్’గా తేలినవారు ఈ కొత్త విధానంలోనూ పాజిటివ్గా తేలారు. ఈ విధానం ఆధారంగా ఫోన్ల నుంచి నమూనాలను సురక్షితంగా సేకరించి, వాటిని విశ్లేషించి, సంక్షిప్త సందేశం ద్వారా ఫలితాన్ని ఆ వ్యక్తికి నేరుగా చేరవేసేందుకు చిలీకి చెందిన స్టార్టప్ కంపెనీ వినూత్న కొవిడ్ టెస్టును యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్-యూకే) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, నొప్పి కలిగించడం వంటి కారణాలు కొవిడ్ బాధితులను వేగంగా గుర్తించడంలో అవరోధంగా మారాయి. ఈ నేపథ్యంలో నొప్పి కలిగించడం వంటి రోగుల అసౌకర్యాన్ని తొలగించేందుకు ఇప్పుడిది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వైరస్ను గురించి వివిధ రకాల సులభమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.