ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా యూఎస్లో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారింది. విమానం ఎక్కేముందు ఒకటికి నాలుగు సార్లు కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఆ ఫ్లైట్లో ఉండగానే పాజిటివ్ అని తేలింది. మిగతా ప్రయాణికులకు ఆమె నుంచి వైరస్ వ్యాప్తి […]
వైరస్ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిలో కోవిడ్ వైరస్ను గుర్తించేందుకు స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. […]
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్డౌన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్పై సాయంత్రానికి […]