ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా యూఎస్లో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారింది. విమానం ఎక్కేముందు ఒకటికి నాలుగు సార్లు కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఆ ఫ్లైట్లో ఉండగానే పాజిటివ్ అని తేలింది. మిగతా ప్రయాణికులకు ఆమె నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా మహిళను నాలుగు గంటల పాటు విమానం బాత్రూంలో స్వియ నిర్బందంలో ఉంది.
ఇది చదవండి : ‘ఏం పేస్ట్ వాడుతున్నావ్’.. వైరలవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 19వ తేదీన చికాగో నుంచి ఐస్ లాండ్ కు 150 మంది ప్రయాణీకులతో ఓ విమానం బయలుదేరింది. ప్రయాణీకులకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. నెగటివ్ వచ్చిన వ్యక్తులను ఫ్లైట్ లో ఎక్కేందుకు అనుమతించారు. వారిలో మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు. గొంతులో నొప్పి..తదితర కారణాలతో అసౌకర్యంగా కనిపించారు. వెంటనే ఆమెకు సిబ్బంది ప్రయాణంలోనే టెస్టులు నిర్వహించారు.
ఆ ర్యాపిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. జర్నీ మొదలైన గంటలోపే మారిసాకు పాజిటివ్ అని తేలడంతో తన సీటును వదిలేసి విమానం బాత్రూంకు వెళ్లిపోయింది. అయిదు గంటల పాటు మారిసా బాత్రూంలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయింది. ఆ నాలుగు గంటలు నరకయాతన అనుభవించానని మారిసా తనకు ఎదురైన దారుణ పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.