అద్భుతంగా ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్లో కరోనా కలవరం మొదలైంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు అంతా క్వారంటైన్లోకి వెళ్లారు. అలాగే 20వ తేదీ బుధవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ కోసం పుణే వెళ్లకుండా ముంబైలోనే ఉండిపోయారు.
ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఆ ప్లేయర్కు ఈ రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయనున్నారు. అందులో కూడా పాజిటివ్ వస్తే మ్యాచ్ నిర్వహణ కష్టమే. కాగా ఈ విషయంలో ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కాగా.. ప్రేక్షకుల మధ్య దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఐపీఎల్లో కరోనా కలవరంతో మరోసారి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
According to reports, Delhi Capitals have cancelled their travel to Pune today as they have been rocked by a Covid outbreak scare 🦠
Reportedly, a player has tested positive on the RAT test and now will undergo RT-PCR test to confirm the same.
📸IPL#IPL2022 #YehHaiNayiDilli pic.twitter.com/BeC67na5ba
— Sportskeeda (@Sportskeeda) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.