టీమిండియా స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్.. కెఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. యాంటిజెన్ పరీక్షల్లో రాహుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్, బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగివచ్చిన రాహుల్.. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణపొందుతున్నాడు.
గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన కెఎల్ రాహుల్.. ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. ఈ క్రమంలో త్వరలో వెస్టిండీస్ తో జరగబోయే టీ20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేసారు.. సెలెక్టర్లు. వారం రోజుల్లో రాహుల్ వెస్టిండీస్ బయరాదేరాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అతను కరోనా బారిన పడడంతో.. కరేబియన్ టూర్ కు అతడు వెళ్లడమనేది అనుమానంగా మారింది.
Kl Rahul tested positive for #COVID19, confirms BCCI President Sourav Ganguly
(file photo) pic.twitter.com/xqnVs8HlA8
— ANI (@ANI) July 21, 2022