వైరస్ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిలో కోవిడ్ వైరస్ను గుర్తించేందుకు స్మార్ట్ఫోన్లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కోవిడ్ను వేగవంతంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అయితే ఈ పరీక్షల నిర్ధారణ కోసం ముక్కులో, గొంతులో పొడవైన స్వాబ్ పెట్టకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. […]
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావ్పల్లి సర్పంచ్కు కరోనా టెస్టు చేస్తుండగా స్వాబ్ స్టిక్ (టెస్ట్ చేసే పుల్ల) విరిగి ముక్కులో ఇరుక్కుపోయింది. సిబ్బంది బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ రాలేదు. వెంటనే కరీంనగర్ తరలించగా అక్కడి డాక్టర్ ఎండోస్కోపి ద్వారా బయటికి తీశారు. గోపాల్రావుపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జవ్వాజి శేఖర్ హాజరయ్యారు. తొలి పరీక్షను ఆయనకే నిర్వహించారు. […]