ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరికీ ఎదురుకానీ సమస్య ఆస్ట్రేలియాలో మొదలైంది. ఇపుడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత సమస్యగా మారిందో ఎలుకలు కూడా అంతే సమస్యగా మరాయి. ఆస్ట్రేలియా దేశం మొత్తంమీద న్యూసౌత్ వేల్స్ అతి పెద్ద రాష్ట్రమని చెప్పాలి. ఈ రాష్ట్రంలోనే జనాభా కూడా చాలా ఎక్కువ. ఇలాంటి రాష్ట్రంలో ఎలా వచ్చిందో ఏమో ఎలుకల సమస్య వచ్చేసింది. రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అని తేడాలేకుండా లక్షలాది ఎలుకలు ప్రజల మీదే కాకుండా పొలాలు, ఆఫీసులు, కార్యాలయాలు తదితరాలపై ఒక్కసారిగా దండయాత్ర చేస్తున్నాయి. ఇళ్ళు, ఆఫీసులతో పాటు భవనాలున్న చోటల్లా ఎలక్ట్రికల్ వైరింగ్ తో పాటు మంచినీళ్ళ పైపులను, గ్యాస్ పైప్ లైన్లను కూడా కొరికేస్తున్నాయి. దీని ఫలితంగా కరెంటు ఆగిపోతోంది, గ్యాస్ రిలీజైపోతోంది, మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఇళ్ళల్లోకి ఎలుకలు ప్రవేశించే అవకాశం లేకుండా అందరు ఎవరి అవస్తలు వారు పడుతున్నారు. ఒక్కసారిగా పెరిగిపోయిన ఎలుకల బెదడ గోధుమ, బార్లీ లాంటి పంటలపైకి లక్షలాది ఎలుకలు దాడులు చేసి నాశనం చేసేస్తున్నాయి. ప్రస్తుత పంటల సీజన్ లో 77.5 కోట్ల అమెరికన్ డాలర్లు నష్టం జరిగే ప్రమాధముందని అధికారులు అంచనా వేశారు. ఎలుకల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్దిక, సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాధం ఉందని న్యూసౌత్ వేల్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఆడమ్ మార్షల్ ఆందోళన వ్యక్తంచేశారంటేనే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమైపోతోంది.
పంట పొలాల్లో ఎలుకలు ఎక్కడున్నాయో అని అధికారులు ద్రోన్లసాయంతో పరిశీలించినపుడు లక్షల సంఖ్యలో ఎలుకలు కనిపించాయి. రోడ్లపైన తిరిగే వాహనాల క్రింద వేలాది ఎలుకలు చనిపోతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవటంతో చాలా ప్రాంతాలు దుర్వాసన పెరగడంతో తక్షణ విపత్తు కింద పరిగణించి ఎలుకలను చంపే 5 వేల లీటర్ల విషం సప్లై చేయమని ఆస్ట్రేలియా మనదేశానికి అర్జంటు ఆర్డర్ పెట్టింది.