ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో జరిగిన పెను విషాదం నుంచి దేశ ప్రజలు ఇంకా బయటపడలేదు. అలాంటిది ఒక చోట రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఒడిశాలో మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనను దేశ ప్రజలు అంత సులువుగా మర్చిపోలేకపోతున్నారు. వందలాది మంది చనిపోయిన, వేలాది మంది గాయపడిన ఈ విషాదం మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ధన నష్టంతో పాటు తీవ్ర ప్రాణ నష్టాన్ని కూడా మిగిల్చిన ఈ ఘటనలో గాయపడిన వారిలో చాలా మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని వైద్యులు చెబుతున్నారు. బాధితుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రమాదం జరిగిన బాలాసోర్కు సమీపంలోని రైల్వే పట్టాలపై తిరిగి రైళ్ల రాకపోకలు ఆరంభమయ్యాయి. పట్టాలను క్లియర్ చేసి, మునుపటిలా రైళ్ల రాకపోకలు వేగంగా సాగేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జపాన్లో రెండు ప్యాసింజర్ విమానాలు పరస్పరం ఢీ కొన్నాయి. ఆ దేశ రాజధాని నగరం టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
టోక్యోలోని హనెడా ఎయిర్పోర్టు దగ్గర టాక్సీ వేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. విమానాలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో రన్వేను అధికారులు ఒక్కసారిగా మూసివేశారు. బ్యాంకాక్కు బయలుదేరిన థాయ్ ఎయిర్బేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్బేస్ ఫ్లైట్ను ఢీ కొట్టింది. ఈ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే జపాన్ స్థానిక మీడియా మాత్రం.. ప్యాసింజర్లకు కొద్దిపాటి గాయాలు అయ్యాయని, అలాగే ఒక విమానం రెక్క దెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాదంపై స్పందించడంలో జాప్యం జరిగిందని.. దీనికి టోక్యో విమానాశ్రమయ అధికారులే కారణమంటూ పలు విమర్శనాత్మక కథనాలు కూడా వెలువర్చడం గమనార్హం.
Some flights were delayed at Tokyo’s Haneda airport on Saturday after two planes appeared to have collided on the ground near a taxiway#Tokyo #Japan #Airplanes pic.twitter.com/wb1QDA3q5i
— News18 (@CNNnews18) June 10, 2023