విదేశాల్లో ఆల్రెడీ నీటి సంక్షోభం ఏర్పడింది. నీటి కోసం ఇతర దేశాలను అడగాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే సింగపూర్ సర్కారు వినూత్న ప్రయగానికి పూనుకున్నది. ధునాతన వ్యవస్థతో కూడిన ఓ ప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వాటిని మంచినీరుగా మార్చి ప్రజలకు అందించాలన్న ధ్యేయంతోనే సింగపూర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. సింగపూర్లో సహజనీటి వనరులు లభ్యత తక్కువ. ప్రతీసారి నీటి సరఫరా కోసం పొరుగున ఉన్న మలేషియా దేశంపై ఆధారపడుతూ ఉంటుంది.
ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వాటిని తాగు నీరుగా మార్చి జనాలకు అందించాలను కుంటున్నారు. భారీ పంపులు, టన్నెల్స్తో కూడిన హైటెక్ ప్లాంట్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ భూగర్భంలో భారీ పంపులు అమర్చారు. తద్వారా మురుగునీటిని శుద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ యూసేజ్ వల్ల సముద్రపు కాలుష్యం తగ్గుతుందని ఆ దేశ వాటర్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. ఇలా భూగర్భ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మురుగు నుంచి తాగు నీరును తీసుకొస్తే భవిష్యత్తులో నీటి కొరతను కచ్చితంగా అధిగమించొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
శుద్ధి అయిన తర్వాత వచ్చిన తాగునీటిని పారిశ్రామిక అవసరాలకూ కేటాయిస్తామని అంటున్నారు. ప్రతిరోజూ 900 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తుంటాయి.ఈ నీటి శుద్దీకరణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుమారు 7.4 బిలియన్ డాలర్లను సింగపూర్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.మురుగు నుంచి తాగునీరు తేవడం కోసం ఏర్పాటు చేసే ప్లాంట్స్కుగాను సింగపూర్ సర్కారు దాదాపు 7.4 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోందట.