నేటి కాలంలో కూడా విమానయానం ఎంతో ఖర్చుతో కుడుకున్న వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు అనేక ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తోన్నాయి. దీనిలో భాగంగా సింగపూర్కి తక్కువ ధరలోనే వెళ్లి అవకాశం కల్పిస్తోంది ఓ విమానయాన సంస్థ. ఆ వివరాలు..
విమాన టికెట్ ధరలు ఎంత తగ్గినా సరే.. నేటికి కూడా విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలనుకోవడం పేద, మధ్యతరగతి వారికి పెద్ద కలే. అయితే గతంతో పోలిస్తే.. నేటి కాలంలో విమాన టికెట్ ధరలు చాలా వరకు తగ్గాయి. విమానయానం కూడా చౌకగా మారింది. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకర్షించడం కోసం అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చౌక ధరలకే విదేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు చౌక విమానయాన సంస్థ స్కూట్ .. కొన్ని నిర్ణీత ప్రాంతాలకు తక్కువ ధరకే విమానంలోప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ స్కూట్ అనేది సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ. ఈ క్రమంలో సదరు సంస్థ మన దేశంలోని విశాఖపట్నం, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి నుంచి తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా లోని 17 గమ్యస్థానాలకు ముందుగానే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ధరలకే టికెట్లు అందిస్తోంది.
దీనిలో భాగంగా తాజాగా స్కూట్ విమానయాన సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి సింగపూర్కు కేవలం 6200 రూపాయలకే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది ఒకవైపు ప్రయాణానికి మాత్రమే. దీనికి పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధంగా స్కూట్ ప్లస్లో భాగంగా ప్రయాణికులు 30 కిలోల చెకిన్ బ్యాగేజ్ తీసుకెళ్లవచ్చు. అలానే భోజనం లాంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.
ఇక ఇటీవల కాలంలో భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కూడా ఆధ్యాత్మిక, విహార యాత్రలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం మంచి మంచి ప్యాకేజీలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కశ్మీర్, కేరళ, థాయ్లాండ్ వంటి ప్రదేశాలకు.. చాలా తక్కువ ధరలోనే వెళ్లి రావొచ్చు. ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. వీటి కోసం భారత్లో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇక ట్రిప్లో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తుండగా.. మధ్యాహ్న భోజనం మాత్రం ప్రయాణికులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.