గాల్లో విమానం వెళుతుందనుకోండి.. ఆ విమానంలో ఉండే వారైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కింద ఉంటే.. నెత్తిమీద నుండి వెళుతున్న విమానం వంక తదేకంగా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా అదే విమానం కూలి
గాల్లో విమానం వెళుతుందనుకోండి.. ఆ విమానంలో ఉండే వారైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కింద ఉంటే.. నెత్తిమీద నుండి వెళుతున్న విమానం వంక తదేకంగా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా అదే విమానం కూలి.. భూమి మీద ఉన్న వారి ప్రాణాలను తీస్తుందని, బహుశా ఎవ్వరూ అనుకుని ఉండరు. ఊహించనవి జరగడమే కదా విధి అంటే. పాపం అదే జరిగింది ఆ ఇద్దరి విషయంలో. విమానం రూపంలో తమ ప్రాణాలు తీస్తుందని తెలియక బయటకు వచ్చారు. విగత జీవులుగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఎక్కడంటే..? మలేషియాలో.
మలేషియాలో దారుణం జరిగింది. తేలికపాటి విమానం కూలి 10 మంది మరణించారు. మృతుల్లో 8 మంది విమానంలోని ప్రయాణీకులు కాగా, ఇద్దరు రోడ్డు మీద వెళుతున్న వారు కావడం గమనార్హం. బీచ్క్రాఫ్ట్ మోడల్ 390 విమానం ఉత్తరాన ఉన్న రిసార్ట్ ద్వీపం లంకావి నుండి బయలుదేరి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళుతోంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపానికి రాగానే ఒక్కసారిగా నేలకొరిగింది. విమానం రోడ్డుపై వెళుతున్న కారు, మోటారు సైకిల్ పై పడటంతో.. ప్రయాణీకులతో పాటు వారిద్దరూ మరణించారు. కూలిన వెంటనే మంటలు చెలరేగాయని మలేషియా పౌర విమానయాన శాఖ ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఆరుగురు ప్రయాణీకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సెంట్రల్ పెహాంగ్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జోహరి హరున్ కూడా ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనిపై విచారణ జరుపుతుంది