తాళికట్టిన భార్యకు నిండు నూరేళ్లు, అన్నింటా తోడుంటానని చెప్పిన భర్త.. ఆ తర్వాత హామీలను కాలికింద తొక్కి పాతిపెడుతున్నాడు. భార్యను వంటింటి కుందేలు చేయడం పక్కన పెడితే.. కనీసం ఇంట్లోని మనిషిగా కూడా చూడటం లేదు.
తాళికట్టిన భార్యకు నిండు నూరేళ్లు, అన్నింటా తోడుంటానని చెప్పిన భర్త.. ఆ తర్వాత హామీలను కాలికింద తొక్కి పాతిపెడుతున్నాడు. భార్యను వంటింటి కుందేలు చేయడం పక్కన పెడితే.. కనీసం ఇంట్లోని మనిషిగా కూడా చూడటం లేదు. నాగరిక సమాజంలో అందులోనూ చదువుకుని అన్ని తెలిసిన వ్యక్తులే భార్య పాలిట పరమ శత్రువులుగా మారిపోతున్నారు. ఆమెను మానసికంగా,శారీరకంగా హింసిస్తున్నారు. తన మాటకు అడ్డు చెప్పినా, చెప్పకపోయినా సరే భార్యను అత్యంత పాశవికంగా టార్చర్ పెడుతూ.. ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతున్నారు మొగుడి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. జర్మన్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిడ్నాప్ చేయడమే కాదూ.. ఏకంగా 12 సంవత్సరాలు పాటు బంధించి హింసించాడు.
అత్యంత హేయనీయమైన ఈ ఘటనలో బాధిత మహిళ పరిస్థితిని చూసిన పోలీసులు సైతం విస్తుపోయారు. బాధితురాలు అర్థనగ్నంగా శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. 53 ఏళ్ల నిందితుడ్ని పోలీసులు ఫోర్ బ్యాక్ పట్టణంలో అరెస్టు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో తనను భర్త కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధీగా ఉంచాడు. ఇనుప తీగలతో కట్టేసి.. కొట్టేవాడు. సరిగ్గా అన్నం కూడా పెట్టేవాడు కాదు. చివరకు ఆమెకు ఫోన్ లభించడంతో.. పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెళ్లి చూడగా.. దీనమైన స్థితిలో సెమీ న్యూడ్ గా మహిళ కనిపించింది. చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను ఆ రూము నుండి బయటకు తెచ్చి.. ఆసుపత్రిలో చేర్చారు.
అయితే ఎప్పుడూ ఆ ఇంటి నుండి అరుపులు బయటకు వచ్చేవని, ఎందుకని ప్రశ్నించగా..తనకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుందని ఇరుగుకు పొరుగుకు చెప్పేవాడని అన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. పోలీసులకు ఆ ఫ్లాట్లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని తెలుస్తోంది.