న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఓ సమాచారమైన క్షణాల్లో చేరిపోతుంది. ప్రపంచంలో ఎక్కడి ఏంజరిగినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎంత మేర నమ్మవచ్చన్నదే సమస్య. ఒక్కోసారి ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తుంటుంది. అందుకని సోషల్ మీడియాలో వచ్చే వాటిలో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో కొన్ని సందర్బాల్లో అర్ధం కాదు.
కరోనా లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కోవిడ్ రిలీఫ్ స్కీమ్ కింద ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 4 వేల రూపాయలు ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియా ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. కరోనా కేర్ ఫండ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఇవ్వనుందని పోస్టులో పేర్కొన్నారు. వెంటనే దరఖాస్తు పూర్తి చేసి తక్షణం 4వేల రూపాయలు పొందాలని ఆ పోస్ట్ సారాంశం.
ఐతే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పోస్టులో నిజమెంత అన్నది చాలా మందికి అర్ధం కాలేదు. చాలా మంది ఎక్కడ ధరఖాస్తు చేసుకోవాలన్నదానిపై ఆరా తీస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయలేదని, ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ తాజాగా నిర్ధారణ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నట్లు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 4వేల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఏదీ లేదని, ఇది తప్పుడు వార్త అని స్పష్టం పీఐబీ తేల్చి చెప్పింది.
కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దే క్రమంలో కేంద్ర ప్రభఉత్వం 6.29 లక్షల కోట్ల ప్యాకేజ్ను ప్రకటించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇలాంటి పుకారును పుట్టించారు. దీనిపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. అందుకని సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు.
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार ‘कोरोना केयर फंड योजना’ के तहत सभी को ₹4000 की सहायता राशि प्रदान कर रही है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। भारत सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/SSLK6x66He
— PIB Fact Check (@PIBFactCheck) July 2, 2021