బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు ఒక్కొక్కరుగా గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. సీరియల్ నటిగా ఎంతో పాపులర్ అయిన వైష్ణవి రామిరెడ్డి అందరికి తెలిసే ఉంటుంది. వైష్ణవి అంటే తెలియకపోయినా.. దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా నటించింది అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పెళ్లికి ముందు సీరియల్స్ లో యాక్టీవ్ గా ఉన్న వైష్ణవి.. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి.. దేవత సీరియల్ నుండి సైతం తప్పుకుంది. పెళ్లయ్యాక సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.
సీరియల్ నటి వైష్ణవి.. ప్రతి విషయాన్నీ యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా షేర్ చేసుకుంటుంది. కరీంనగర్ కి చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్న వైషూ.. అప్పటిదాకా నటిగా కొనసాగి ఒక్కసారిగా పెళ్లి వార్తలతో అవాక్కయ్యేలా చేసింది. ఆమె పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇక పెళ్ళైన కొంతకాలానికి(గతేడాది సెప్టెంబర్ లో) తల్లి కాబోతున్న వార్తతో సర్ప్రైజ్ చేసింది. తాజాగా మరోసారి సర్ప్రైజింగ్ ఫోటోలు పెట్టి.. ఫ్యాన్స్ ని సంతోషపెట్టింది. అవును.. తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్న విషయాన్నీ గుర్తుచేస్తూ.. సీమంతం ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం వైష్ణవి సీమంతం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మీ విషెష్ ని కామెంట్స్ లో తెలపండి.