తన జీవితంలో ప్లాప్ అనే పదాన్ని ప్లాప్ చేసిన బిగ్గెస్ట్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి. అపజయమెరుగని దర్శకధీరుడిగా ముద్ర వేయించుకున్న రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తన సినిమాలని ప్రతీ ఒక్కరికీ రీచ్ అయ్యే విధంగా ప్రమోట్ చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తన సినిమాలనే కాకుండా ఇతర సినిమాలని కూడా ప్రమోట్ చేస్తుంటారు. రాజమౌళి నోట ఒక సినిమా పేరు వచ్చిందంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందన్న నమ్మకం ఉంటుంది. తాజాగా ఆయన బ్రహ్మాస్త్రం సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. మామూలుగా సినిమాలని ప్రమోట్ చేసుకోవడానికి టీవీ షోస్ ని వాడుకుంటూ ఉంటారు ఆయా సినీ బృందాలు. ఆ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడిందంటే జబర్దస్త్, క్యాష్ వంటి షోస్ లో సందడి చేస్తుంటారు మూవీ యూనిట్.
తాజాగా బ్రహ్మాస్త్రం టీమ్ కూడా క్యాష్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఇందులో రాజమౌళి ఉండడం కూడా విశేషం. రాజమౌళి పనిగట్టుకుని ఎప్పుడూ లేనిది క్యాష్ షోకి రావడం ఏంటి అని అనిపించవచ్చు. కానీ ఆయన రావడానికి ఒక కారణం ఉంది. సౌత్ భాషలకు సంబంధించి ఈ సినిమాకి ప్రెజెంటర్ గా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్రం సినిమాని సమర్పిస్తున్నారు. అందుకే రణబీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి ఆయన క్యాష్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి రాకతో యాంకర్ సుమ ఒక్కసారిగా కల, నిజమా అన్న సందిగ్ధంలోకి వెళ్లిపోయారు. ఒకసారి గిచ్చరా అండి అని రాజమౌళితో అనగానే ఆయన సుమ చేతి మీద గిల్లారు. దీంతో ఆమె రాజమౌళి వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా ఈ షో త్వరలో టెలికాస్ట్ కానుంది. ఇక బ్రహ్మాస్త్రం సినిమా సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి క్యాష్ షోకి రాజమౌళి రావడంపై మియు అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.