సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం కామన్ అయిపోయింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు ఆ తర్వాత పలు కారణాలతో విడిపోతున్నారు. మరికొంత మంది డేటింగ్ చేస్తూ బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇంకొందరు విడిపోయాక రియలైజ్ అవుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం కామన్ అయిపోయింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు ఆ తర్వాత పలు కారణాలతో విడిపోతున్నారు. మరికొంత మంది డేటింగ్ చేస్తూ బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇంకొందరు విడిపోయాక రియలైజ్ అవుతున్నారు. ఇటీవల సీనియర్ నటి నళిని తన భర్తతో విడిపోయినా ఇప్పటికే తనంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ నటి, లెజెండరీ డైరెక్టర్ మహేష్ భట్ పెద్ద కూతురు పూజా భట్ తన విడాకుల గురించి మాట్లాడుతూ.. తప్పంతా తనదేనని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఆలియా భట్ అక్క అయిన పూజా నటిగానే కాకుండా నిర్మాత, దర్శకురాలిగానూ రాణించింది. ఈమె భర్త మనీష్ మిఖిజాతో 9 సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకుంది. అప్పటి సంగతులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
అలా మద్యానికి బానిసయ్యా
‘నా భర్త చెడ్డవాడేం కాదు, నా జీవితాన్ని నాకు నచ్చినట్లు బతకాలనుకున్నాను. నన్ను నేను మోసం చేసుకుంటూ ఎన్నాళ్లని ఉంటాననిపించింది. నేను ముఖ్యమా? విడాకులు ముఖ్యమా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు రెండో దానికే మొగ్గు చూపాను. అదంతా సడెన్గా జరిగిపోయింది. అయితే తనకు విడాకులు ఇచ్చినప్పుడు నాకైతే ప్రాణం పోయినట్లనిపించింది. అలా మద్యానికి బానిసయ్యాను. అది నా జీవితంలో అత్యంత దారుణమైన దశ’ అంటూ ఎమోషనల్ అయ్యింది.
బిగ్ బాస్ వల్ల
పూజా భట్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్లో ఓ కంటెస్టెంట్గా పార్టిసిపెట్ చేసింది. ఓ టాస్క్ సందర్భంగా తన జీవితంలో జరిగిన విషయాల్ని వెల్లడించింది. మద్యానికి బానిస కావడం, పిల్లలు లేకపోవడం వంటి కారణాల గురించి చెప్పింది. 2003లో మనీష్ని పెళ్లి చేసుకున్న పూజా 2014లో అతనితో విడిపోయింది.
ఇది కూడా చదవండి : సాయి తేజ్ పక్కన ఇతన్ని గుర్తు పట్టారా? ఒకప్పటి యంగ్ హీరో!