భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో తన ఇంటికి వచ్చేవాడని.. తన భార్య దగ్గర దొరకడం లేదని అందుకోసం తన ఇంటికి వచ్చేవాడని కంగనా రనౌత్ వెల్లడించింది. ఇంతకే ఆ హీరో ఎవరు?
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఆమె ఏం చేసినా వివాదానికి దారి తీస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ హాట్ బ్యూటీ.. ఏదైనా ఒక పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో వైరల్ అయ్యి తీరాల్సిందే. తరచుగా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాకి సంబంధించిన విషయాలు గురించే కాకుండా పొలిటికల్ విషయాల గురించి కూడా ఈమె స్పందిస్తుంటుంది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరోని టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అతనొక సూపర్ స్టార్ అని.. స్త్రీ లోలుడని.. భార్య ఉన్నా కూడా తనతో ఉండమని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడేవాడని ఆమె కామెంట్స్ చేసింది. ఆ హీరో పేరు ఎక్కడా చెప్పలేదు కానీ ఎవరో అర్థమయ్యేలా మాత్రం హింట్స్ ఇస్తూ కామెంట్స్ చేసింది.
దీంతో రణబీర్ ని ఉద్దేశించే పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. రణబీర్ పెళ్లి ఒక నాటకమని ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి రణబీర్ పై విరుచుకు పడుతూ తన ఇన్స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇంకో సూపర్ స్టార్, స్త్రీ లోలుడిగా తెలిసిన వ్యక్తి.. నా ఇంటికి వచ్చేవాడు. డేట్ చేయమంటూ ఆదుకునేవాడు. ప్రాధేయపడేవాడు. రహస్యంగా నన్ను వెంబడించేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ అని అడిగితే.. డాడీ లిటిల్ ప్రిన్సెస్ ని తాను లవ్ చేయడం లేదని అన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లిటిల్ ప్రిన్సెస్ తో కలిసి జీవించడం ఇష్టం లేదని.. ఈ విషయం ఆమెకు చెప్పలేనని.. నువ్వు ఒప్పుకుంటే సీక్రెట్ గా కలిసి జీవిద్దామని ఆ సూపర్ స్టార్ చెప్పినట్లు ఆమె రాసుకొచ్చింది.
ఎన్ని సార్లు నంబర్ బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్ చేసేవాడని.. ఆ తర్వాత నా ఫోన్లు హ్యాక్ అయ్యాయని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. తన పెళ్లే ఒక అబద్ధమని చెప్పాడని.. ఆ పుట్టిన బేబీ కూడా మూవీ ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అని అన్నట్టు ఆమె వెల్లడించింది. ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎవరైనా సరే నైతికంగా తప్పుడు పనులకు పాల్పడతారో వారు మనుషులు కాదు, రాక్షసులు. అందుకే వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. అధర్మాన్ని నాశనం చేయడమే ధర్మం యొక్క అసలైన ఉద్దేశం. అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని ఆమె తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.
దీంతో రణబీర్ కపూర్ ని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ మూవీలో నటిస్తుంది. ఇందులో భారత మాజీ ప్రధాని ‘ఇందిరా గాంధీ’ పాత్రలో కంగనా కనిపించనుంది. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘చంద్రముఖి-2లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాల తర్వాత ‘తేజస్’ సినిమాలో నటించనుంది. ఇందులో ఆమె పైలట్ పాత్ర చేయబోతుందని సమాచారం. మరి కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.