ఓ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే మాటలు కాదు. ప్రేక్షకుడు తాను పెట్టే టికెట్ ఖరీదుకు రెట్టింపు వినోదం లభిస్తుంది అనుకుంటేనే.. థియేటర్కి వస్తాడు.. అప్పుడు మాత్రమే ఓ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిగలగుతుంది. ఒకప్పుడు సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరడానికే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా మార్కును ఫస్ట్డేనే దాటేస్తున్నాయి. ఇప్పుడంతా టార్గెట్ 500, 1000 కోట్లు. ఈ టార్గెట్ని కూడా కొన్ని సినిమాలు సునాయసంగా దాటేశాయి. ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రంలో 4 సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. అవి బాహుబలి-2, RRR, KGF-2, దంగల్. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. 4 సినిమాలు వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లో చేరగా.. వీటిలో మూడు సినిమాలు సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: KGF-2 కొత్త రికార్డ్! 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన రాకీ భాయ్!
బాహుబలి-2.. తొమ్మిది రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరగా.. RRR 16 రోజుల్లో, KGF-2 15 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. ఇప్పటికే సౌత్ సినిమాలు చూసి.. ఈర్షపడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఈ రికార్డులు చూసి మరింత కుళ్లుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో విడుదలైన సినిమాలు అన్ని వరుసగా.. ఫ్లాప్ అవుతుండగా.. సౌత్లో తెరకెక్కి హిందీలో విడుదలైన పుష్ప, RRR, KGF ఓ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. దాంతో ప్రసుత్తం బాలీవుడ్ పరిస్థితి.. కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ హీరోలు.. సౌత్పై నోటికొచ్చిన్నట్లు వ్యాఖ్యలు చేస్తూ తమ అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. వీరిలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగణ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంట్రి ప్రముఖులు ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: Andrea: ‘పిశాచి -2′ కోసం హీరోయిన్ ఆండ్రియా సాహసం! 15 నిమిషాల పాటు వివస్త్రగా!
ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్కి చాలా చిన్నచూపు ఉండేది. మన దగ్గర సినిమాల్లో నటించాలన్న పెద్దగా ఆసక్తి చూపకపోయేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో.. అప్పటి నుంచి అన్ని ఇండస్ట్రీల చూపు సౌత్ వైపు మళ్లింది. ఆ తర్వాత విడుదలైన బాహుబలి-2, కేజీఎఫ్ చిత్రాలు మరిన్ని సంచలనాలకు వేదికలయ్యాయి. ఇక బాహుబలి-2 అయితే ఏకంగా 9 రోజుల వ్యవధిలోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరి.. భారతీయ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాక బాహుబలి-2 బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి ఉత్తరాదిలో సౌత్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ మొదలయ్యింది. దీన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. అవును మరి ఏళ్లుగా భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అన్నట్లు ఉన్న పరిస్థితి కాస్త తారుమారయ్యింది. ఇక కరోనా తర్వాత విడులైన సౌత్ సినిమాలన్ని ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా భారీ కలెక్షన్లు రాబట్టాయి.
ఇది కూడా చదవండి: Acharya Collections: టాక్కు భిన్నంగా ‘ఆచార్య’ ఫస్ట్ డే కలెక్షన్స్..
ఇక 2022లో బాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఇప్పటి వరకు అక్కడ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన చిత్రం ఒక్కటి కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది చిత్రాలైన పుష్ప, RRR, KGF చాప్టర్ 2 సినిమాలు ఉత్తరాదిలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలను తలదన్నే రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాదికి చెందిన చిన్న చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా దిశగా అడుగులు వేస్తుండగా.. బాలీవుడ్ మాత్రం.. వరుస ఫ్లాప్లతో కుదేలవుతోంది. ఆ అక్కసునంతా.. ఇలా చిల్లర కామెంట్ల రూపంలో ప్రదర్శిస్తోంది.
కానీ ఇక్కడ ఎవరైనా ఒక్క అంశం గుర్తు పెట్టుకోవాలి.. సినిమాలకు సంబంధించినంత వరకు ప్రేక్షకుడే అల్టిమేట్. ఎంత ఖర్చు పెట్టినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఫైనల్ గోల్ ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ అందించడం. ఆ విషయంలో సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతుండగా.. బాలీవుడ్ మాత్రం బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉండిపోయింది. ఇన్నాళ్లు సౌత్ సినిమాలను చీప్గా చూసిన బాలీవుడ్కి ఇప్పుడు అదే దక్షిణాది సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్కి CEO గా మారడం ఏమాత్రం రుచించడం లేదు. కానీ ప్రేక్షకులు తీర్పు కావడంతో ఏం అనాలో తెలియక సతమతమవుతోంది. మరి సౌత్ సినిమాల దెబ్బకు విలవిల్లాడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.