మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే.. ఉగాది సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్ లో రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు.
ఇక రవితేజ సినిమా వేడుకలో రేణు దేశాయ్ ఏంటబ్బా? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఈవెంట్ లో అందరిని నవ్వుతూ పలకరించిన రేణు.. స్టేజిపైకి వెళ్లి మాట్లాడేటప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రేణు దేశాయ్ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వర్రావు మూవీలో తాను నటిస్తున్నట్లు చెప్పారు. అలాగే సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చారని మేకర్స్ కి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతోంది. మరి రేణు దేశాయ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.