రేణు దేశాయ్ ముక్కు సూటిగా, డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాల గురించే కాకుండా అప్పుడప్పుడూ సమాజంలో జరిగే వాటి గురించి కూడా ఆమె స్పందిస్తుంటారు. తాజాగా ఆమె ఓ విషయంలో కోర్టుకెక్కారు.
దక్షిణ హైదరాబాద్ లో డెస్టినేషన్ సిటీగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి రూపుదిద్దుకుంటుంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరానికి మరింత శోభ తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడలో ఎకో పార్క్ లో ఈ అక్వేరియాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. పక్షుల ఆవాస కేంద్రంగా, దేశంలోనే అతిపెద్ద అక్వేరియంగా ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.
దేశంలో బెంగళూరు సహా పలు నగరాల్లో అండర్ టన్నెల్ అక్వేరియంలు ఉన్నాయి. బెంగళూరులో అండర్ వాటర్ టన్నెల్ ఆకవీరియం సందర్శకులకు అందుబాటులో ఉంది. ఇలాంటిదే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొత్వాల్ గూడలో ఇది వరకే శంకుస్థాపన జరిగింది. ఉస్మాన్ సాగర్ ల్యాండ్ స్కేప్ ఎకో పార్క్ ని కూడా ప్రారంభించారు. అయితే ఈ ఎకో పార్క్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఆక్వా మెరైన్ పార్క్ ఏర్పాటుని నిరసిస్తూ కొంతమంది ఉద్యమాన్ని చేపట్టారు. ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును ఏర్పాటు చేయడం పర్యావరణానికి ప్రమాదకరమని.. ఈ నిర్మాణాన్ని నిలిపివేయమని ఆదేశాలు ఇవ్వాలంటూ రేణు దేశాయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
శ్రీదివ్య, సదా, దర్శకుడు శశికిరణ్ టిక్కాతో పాటు పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. వీరంతా కలిసి ఈ పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ ని విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాం జి.. ఇలాంటి ఆక్వా పార్కులు, అండర్ వాటర్ టన్నెల్స్ సింగపూర్, మలేషియా లాంటి అనేక దేశాల్లో ఉన్నాయని.. తెలంగాణలో ఎందుకు నిర్మించకూడదని ప్రశ్నించారు. పిటిషన్ తరపు వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మరి రేణు దేశాయ్ పిటిషన్ వేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.