Prakash Raj: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో అదే విషయంపై ఎలాంటి చర్చ లేకుండా ప్రకాష్ రాజ్ తాజాగా ఓ సెటైర్ వేశాడు. గతంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఒకప్పుడు మన దేశంలో’ అని జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశాడు. ప్రకాష్ రాజ్ షేర్ చేసిన పోస్ట్ లో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, జూహీ చావ్లాల ట్వీట్ లను మెన్షన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ట్వీట్స్ లో ‘సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.. బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. హృదయం కరప్షన్ తరహాలో జాయ్ తో నిండిపోవాలి’ వివేక్ అగ్నిహోత్రి చేసిన సెటైర్ అప్పట్లో వైరల్ అయింది. ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది. అలా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లతో పాటు జూహి చావ్లా.. ఏకంగా రూపాయి విలువను ఒక ఇన్నర్ వేర్ తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. అయితే.. వీరంతా 2012, 13లోనే ఈ ట్వీట్స్ చేశారు. మరి తాజాగా ప్రకాష్ రాజ్ సెటైర్ పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Once upon a time…in my country.. #justasking pic.twitter.com/KOgkQwQwAy
— Prakash Raj (@prakashraaj) July 20, 2022