సౌత్ ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా చేతుల మీదుగా మొదలైన ఈ షో.. విజయవంతంగా ఇటీవల పద్నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో పదిహేనో సీజన్ కి ఆరంభం పలకనున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి ఢీ15 సీజన్ ని ఏకంగా ప్రభుదేవాతోనే లాంచ్ చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ మొదటి ఎపిసోడ్ ని ఆదివారం ప్రసారం చేయనున్నారు. కాగా.. తాజాగా ఈ ఢీ 15 లాంచ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.
ప్రోమో అంతా ఎనర్జిటిక్ గా సాగింది. ప్రభుదేవా మాస్టర్ తో పాటు షోలో రెగ్యులర్ గా కనిపించే జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ కూడా సందడి చేశారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఓ కంటెస్టెంట్ పెర్ఫార్మన్స్ తర్వాత స్టేజ్ పై ఎమోషనల్ మూమెంట్ చోటుచేసుకుంది. స్టేజ్ పై పెర్ఫార్మన్స్ అనంతరం యాంకర్ ప్రదీప్.. ఆ కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ, తమ్ముడిని పిలిపించి సర్ప్రైజ్ చేశారు. దీంతో వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ప్రభుదేవా, జానీ మాస్టర్స్ సైతం కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఎపిసోడ్ పూర్తి వీడియో డిసెంబర్ 11న రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతుంది.