సాధారణంగా వివిధ రంగాలలో రాణిస్తూ ఆయా రంగాలలో సేవలను కొనసాగిస్తున్న వారికి యూఏఈ(దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంటుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా ఉండవచ్చు. 2019 నుండి ఈ గోల్డెన్ వీసాలను జారీ చేయడం ప్రారంభించింది యూఏఈ ప్రభుత్వం. దీనిలో భాగంగా బయటి దేశాలవారు అక్కడే ఉండటం, పని చేసుకోవడం, పై విద్యలు కొనసాగించేందుకు స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా అన్నివిధాలా అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ గోల్డెన్ వీసా ఉన్నవారు సొంత వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.
ఇక యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాలను లాంగ్ టర్మ్ వీసాలని అంటుంటారు. వాటి కాలపరిమితి 5 – 10 సంవత్సరాల వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ రెన్యూవల్ అవుతుంది. అయితే.. గోల్డెన్ వీసాలను ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తుంటారు భారతీయులు. తాజాగా ఈ గోల్డెన్ వీసాను టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ అందుకున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టిన సుకుమార్ కి, యూఏఈ గవర్నమెంట్ అందించే గోల్డెన్ వీసా వరించడం విశేషం. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా సుకుమార్ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ గోల్డెన్ వీసాను టాలీవుడ్ నుండి మొదటగా స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన అందుకున్నారు. ఇప్పుడీ గోల్డెన్ వీసాను అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాలో సుకుమార్ చేరారు. ఇక ఇండియా నుండి మొట్టమొదటి గోల్డెన్ వీసాను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని వరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలువురు స్టార్స్ తో పాటు.. తమిళం నుండి మొదటగా హీరోయిన్ త్రిష అందుకోవడం మరో విశేషం. మలయాళంలో మోహన్ లాల్ మొదటగా పొందారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. మరి డైరెక్టర్ సుకుమార్ గోల్డెన్ వీసా పొందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Sensational pan-India director #Sukumar is one of the few Indian celebs to receive a golden visa from the UAE government.
After the blockbuster #PushpaTheRise, the director has received this special privilege as an honour
@PushpaMovie
@aryasukku #pushpaTherule pic.twitter.com/MLKQSyFEwD— Maduri Mattaiah (@madurimadhu1) September 6, 2022