కోరిన కోర్కెలు తీర్చి, కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్రమైన షిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి ఆయన్ను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన్ను దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్నవి వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సాయి బాబా దివ్హ్యలీలలు అపూర్వం అమోఘం, అయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే అయన అనుగ్రహం పొందాలంటే అన్ని జీవరాశులను అన్ని కులమతాలని ఒకే రకంగా చూసి ఆయన కలియుగానికే సోదర భావం ఏర్పరిచారు. బాబాకి చాలా ఇష్టమైనది అన్నదానం. మనం తెలియక చేసిన పాపాలు కడిగివేసుకోవాలి అనుకుంటే, అన్నదానం చేయాలి.
ప్రతి గురువారం మనకి ఉన్న దాంట్లో ఒక పండో ఫలమో అన్నమో దానం చేయాలి. వీలు కుదిరితే రోజు కూడా చెయ్యొచ్చు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆశకి హద్దు ఉండదు. కొంత జీతం వస్తే ఇంకొంచెం కావాలని అనుకుంటారు. అలాగే వేరేదైన ఇచ్చిన దానికి సంతృప్తి చాలా మటుకు ఉండదు. అయితే కేవలం ఒక్క ఆకలి విషయంలో ఎవ్వరూ తమకి కావలసినంత మాత్రమే తీసుకుంటారు.
ఎవరికైనా దానం చెయ్యవచ్చు. ఎందుకంటే సకల జీవరాశులకి అకలీ బాధ అనేది ఒకటే అందుకే కుక్కకి లేదా మూగ జీవులకి లేదా గుడిలో భక్తులకి ఎవరికైనా సరే ఏదైనా తినే పదార్ధం దానం చేస్తే వంద జన్మల పుణ్యం. బాబా ఆ కుటుంబాలకు ఎప్పుడు రక్షగా ఉంటాడు.