గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను కొలుస్తారు.
గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతే కాకుండా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గురు పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ పండుగను మూడు రోజుల పాటు కూడా నిర్వహిస్తుంటారు. ఈ పండుగ నేపథ్యంలో సోమవారం సాయి బాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత మంది భక్తులు ఓవరాక్షన్ చేశారు.
కోరిక కోర్చెలు తీర్చాలని, కష్టాల నుండి గట్టెక్కించాలని దేవుడికి పూజ చేసి,కొబ్బరి కాయ కొట్టి, నైవేద్యం సమర్పిస్తాం. ఇక పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో ఇష్ట దేవతలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. నైవేద్యాలను సమర్పించి, పంచామృతాలతో అభిషేకాలు చేస్తుంటారు. గురు పౌర్ణమి నాడు కూడా బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న సాయి బాబా ఆలయంలో భక్తులు.. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆచంట మండలంలోని వేమవరం గ్రామంలో సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు.. లిక్కర్ బాటిల్స్లో తేనే, ఇతర ద్రవ్యాలను తీసుకువచ్చి అభిషేకం చేశారు. ఆల్కహాల్ సీసాల్లో ద్రవ్యాలను తీసుకువచ్చి ఇలా అభిషేకం చేయడం పట్ల బాబా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.