గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను కొలుస్తారు.
ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆలయాలకు తరలి వెళ్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బాబాని పూజిస్తారు. కొంతమంది అయితే సాయిబాబాకి కానుకలు సమర్పిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ కి చెందిన వ్యక్తి షిరిడి సాయిబాబాకి బంగారు కిరీటాన్ని బహుకరించారు. దాని ధర ఎంతో తెలుసా?