శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ గా మారాడు. ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో అందరి కోపానికి కారణం అవుతున్నాడు. తాజాగా శంభాజీ భిడే సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలతో దేశాన్ని హీటెక్కిస్తున్నాడు హిందుత్వ అనుకూల నేత శంభాజీ భిడే. ఇతని అసలు పేరు మనోహర్ భిడే. ఇటీవలే మహాత్మ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. మహాత్మ గాంధీ ఒక ముస్లిం భూస్వామి కుమారుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా తనదగ్గర ఉన్నట్లుగా తెలియజేశాడు. ఒక రోజు కరంచంద్ గాంధీ ఆ ముస్లిం భూస్వామి నుండి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించి పారిపోయాడని ఆగ్రహానికి గురై ఆ భూస్వామి మహాత్మా గాంధీ తల్లిని తన ఇంటికి తీసుకువెళ్లాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని మరువక ముందే శంభాజీ భిడే సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ గా మారాడు. ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో అందరి కోపానికి కారణం అవుతున్నాడు. ఇప్పటివరకు పెద్ద, పెద్ద దేశ రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఇతను తాజాగా హిందూ మతం మీద సాయిబాబా మీద కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సాయి బాబా దేవుడి గురించి మాట్లాడుతూ ” సాయిబాబా ఆలయానికి హిందువులు వెళ్లడం మానేయాలి. ఎందుకంటే ఆయన అసలు హిందూ దేవుడు కాదు. సాధారణంగా హిందువులు సాయిబాబాను పూజిస్తారని, కానీ ఆయన దానికి అనర్హుడు. హిందువుల ఫోటోలను, విగ్రహాలను ఇళ్లలో నుంచి తొలగించి పారేయాలి. ఈ వ్యాఖ్యలని బట్టి నన్ను పిచ్చి వాడని అనుకుంటారు. కానీ నేను ఈ విషయాన్ని బాధ్యతగా చెబుతున్నాను. సాయి బాబాను అసలు దేవుడిగా భావించకూడదు”. అని ఈ సందర్భంగా శంభాజీ భిడే తెలియజేశాడు.
ప్రస్తుతం శంభాజీ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కేంది. ప్రతిపక్షాలు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. శంభాజీ భిడే వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం మండిపడ్డారు. దేశాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని దేశ ద్రోహం కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీలోని రెండు వర్గాలు సోమవారం ముంబైలోని మంత్రాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. మరి ఈ గొడవ ఎప్పటికి చల్లారుతుందో ఈ లోపు మరేమైనా సంచలన వ్యాఖ్యలు చేస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.